కార్పొరేట్‌ క్వీన్‌ మిసెస్‌ ఇండియాగా ప్రీతి అడుసుమిల్లి | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ క్వీన్‌ మిసెస్‌ ఇండియాగా ప్రీతి అడుసుమిల్లి

Published Mon, Apr 8 2024 8:15 AM

- - Sakshi

మాదాపూర్‌: ప్రతిష్టాత్మక కార్పొరేట్‌ క్వీన్‌ మిసెస్‌ ఇండియా– 2024, క్లాసిక్‌ మిసెస్‌ ఇండియా– 2024 క్రౌన్‌ విన్నర్‌గా డాక్టర్‌ ప్రీతి అడుసుమిల్లి నిలిచారు. ఆదివారం మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. మిసెస్‌ ఇండియా పేజెంట్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఇటీవల గుర్‌గావ్‌లో జరిగాయి. జాతీయ పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన డాక్టర్‌ ప్రీతి అడుసుమిల్లి గత సెప్టెంబర్‌లో మిసెస్‌ ఇండియా తెలంగాణ రన్నరప్‌గా నిలిచారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌, డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement