వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో 100 శాతం ఫలితాలు | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో 100 శాతం ఫలితాలు

Published Tue, Apr 23 2024 8:30 AM

-

కడప స్పోర్ట్స్‌ : కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల పదోతరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. పాఠశాల నుంచి 34 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 33 మంది ఫస్ట్‌క్లాస్‌లోను, ఒకరు సెకండ్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కావడం విశేషం. పాఠశాల విద్యార్థిని ఎస్‌. రిచిత 573 మార్కులు, జి. శ్రీలక్ష్మి 560, కె. అనూరాధ 555, వి.హేమలత 553తో పాటు పలువురు విద్యార్థినులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కె. జగన్నాథరావు అభినందించారు.

Advertisement
Advertisement