పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...
Breaking News
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 20 మందికి గాయాలు
Published on Sat, 02/15/2014 - 08:41
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లె వంతన వద్ద శనివారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఆ ఘటనలలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అలాగే వరంగల్ జిల్లా రాయపర్తి శివారులో భక్తులతో తిరుపతి వెళ్తున్న కారు బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి అతి వేగంగా కారు నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని భక్తులు వెల్లడించారు.
Tags