Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
Published on Sat, 01/06/2018 - 02:19
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్కు భవిష్య త్తు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధానికి విన్నవించింది. లోక్ సభలో పార్టీ విప్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోదీకి విభిన్న అంశాలపై 4 వినతి పత్రా లతో కూడిన లేఖ రాశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నాటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిన అవసరం ఉంది. హోదా ఇస్తే పరిశ్రమలు, తద్వారా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కేబీకే, బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో నిధులివ్వాలి. ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలని కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు.
#
Tags