amp pages | Sakshi

‘పోలవరం’లో మరో బాగోతం

Published on Sat, 07/14/2018 - 02:57

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ‘జాతీయ రహదారి–16’ను క్రాస్‌ చేసే రెండు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ.29.40 కోట్లు అదనంగా చెల్లించడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఆ పనులు వారికి అప్పగించినప్పుడు వాటి విలువ రూ.39.35 కోట్లు కావడం గమనార్హం. అంటే ఏడాదిలోనే ఆ పనుల అంచనా వ్యయాన్ని 75 శాతం పెంచేశారు. దీన్నిబట్టి కమీషన్లు ఏ స్థాయిలో చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. 

పనులు చేయని కాంట్రాక్టర్లకు వత్తాసు 
తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారి–16ను పోలవరం ఎడమ కాలువ నాలుగు ప్రాంతాల్లో క్రాస్‌ చేస్తుంది. ఈ ప్రదేశాల్లో కాలువపై ఆరు వరుసలతో బ్రిడ్జి, రెండు వరుసలతో సర్వీసు రోడ్లు నిర్మించాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు గత ఏడాది జూలైలో గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద(ఎడమ కాలువపై 41.560 కి.మీ. వద్ద) రూ.16.05 కోట్లతో, మురారి వద్ద (ఎడమ కాలువపై 33.599 కి.మీ. వద్ద) రూ.22.17 కోట్లతో, శంఖవరం మండలం ఆరేపల్లి వద్ద(ఎడమ కాలువపై 93.7 కి.మీ. వద్ద) రూ.21.07 కోట్లతో, తుని మండలం కోనేరు వద్ద(ఎడమ కాలువపై 103.658 కి.మీ. వద్ద) రూ.22.52 కోట్లతో జాతీయ రహదారి–16ను కలుపుతూ ఆరు వరుసల బ్రిడ్జిలు, బ్రిడ్జికి రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

మల్లేపల్లి బ్రిడ్జి పనులను 2.99 అధిక(ఎక్సెస్‌) ధరకు అంటే రూ.16.53 కోట్లకు తన సన్నిహిత కాంట్రాక్టర్‌కు, మురారి బ్రిడ్జిని 2.97 ఎక్సెస్‌కు అంటే రూ.22.87 కోట్లకు మరో సన్నిహిత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేలా కీలక మంత్రి చక్రం తిప్పారు.  అయితే సన్నిహిత కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం లేకపోవడంతో అప్పట్లో టెండర్లను రద్దు చేశారు. గత నెల 28న ఆరేపల్లి, కోనేరు బ్రిడ్జిలకు గతేడాది జూలైలో నిర్ణయించిన అంచనా వ్యయంతోనే జలవనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం మల్లేపల్లి, మురారి బ్రిడ్జిలు ఆరు నెలల్లో పూర్తి కావాలి.

నిబంధనల మేరకు పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన కీలక మంత్రి  వారికి అదనపు బిల్లులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కీలక మంత్రి దన్నుతో మల్లేపల్లి బ్రిడ్జి కాంట్రాక్టర్‌ రూ.13.32 కోట్లు.. మురారి బ్రిడ్జి కాంట్రాక్టర్‌ రూ.16.08 కోట్లు అదనంగా చెల్లించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.  దీంతో కీలక మంత్రి ఒత్తిడి మేరకు ఆ కాంట్రాక్టర్‌లకు రూ.29.40 కోట్లను అదనంగా చెల్లించడానికి ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిఫలంగా కీలక మంత్రికి  రూ.20 కోట్లు మేర కమీషన్లు దక్కనున్నట్లు సమాచారం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)