amp pages | Sakshi

రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

Published on Fri, 10/11/2019 - 19:10

సాక్షి, అమరావతి: 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే లక్ష్యమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వాటర్‌గ్రిడ్‌ పథకంపై  ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.  రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు డిజైన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైప్‌లైన్ల ద్వారా నీటి సరాఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో దీర్ఘకాలంగా భూగర్భజలాల వినియోగిస్తున్నారని...ఆ మూడు జిల్లాల్లో సర్ఫేస్‌ వాటర్‌ సరఫరాకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్‌ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని..ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, కడప, నెల్లూరు,ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. గిరిజన గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని.. జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటివనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు తయారు చేయాలన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)