amp pages | Sakshi

ఆంగ్ల మీడియానికి జనామోదం

Published on Sun, 11/17/2019 - 05:28

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం అతి పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని సామాన్య ప్రజానీకం, విద్యార్థుల తల్లిదండ్రులు, మెజార్టీ విద్యావేత్తలు, సామాజికవేత్తలు సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. ఒక్క చోట కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజామోదానికి నిదర్శనం. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవితకు బంగారు బాట వేసే ఈ నిర్ణయాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఆనవాయితీగా విమర్శించడం విస్మయపరిచింది.  

నాలుగేళ్లలో అన్ని తరగతుల్లో బోధన..
వర్తమాన పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కమ్యూనికేషన్‌ స్కిల్స్, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఏకైక మార్గమన్నది నిర్వివాదాంశం. తెలుగు మీడియం విద్యార్థులు ఈ అంశంలో వెనుకబడుతుండటం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. ఆధునిక విజ్ఞానం అంతా ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన అమలు చేస్తారు. నాలుగేళ్లలో అన్ని తరగతులు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేలా చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. తెలుగు భాష అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)