amp pages | Sakshi

అతనంటే ఒకింత అలజడే..

Published on Sun, 08/06/2017 - 11:34

► చిటికెలో ద్విచక్ర వాహనాల చోరీ 
► కంప్యూటర్‌లో అడ్రస్సులు తీసి మెకానిక్‌లకు టోకరా
► వలపన్ని పట్టుకున్న బాపట్ల పోలీసులు
 
బాపట్ల :  ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల పోలీసులకు జ్యోతిశివశ్రీ అలియాస్‌ గణేష్‌ అంటే ఒకింత అలజడే. చిటికలో ద్విచక్ర వాహనాన్ని మాయం చేయటంతోపాటు ఆధారాలు చూపించి మరీ వాహనాలను విక్రయించటంలో సిద్ధహస్తుడు. పోలీసు రికార్డుల్లో 120కిపైగా ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడగా రికార్డుకాని కేసులు ఎన్ని ఉన్నాయోనంటూ పోలీసు అధికారులు పెదవి విరుస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడికి చెందిన జ్యోతిశివశ్రీ అలియాస్‌ గణేష్‌ బాపట్ల ప్రాంతానికి చెందిన ఏనిమిది ద్విచక్రవాహనాలు చోరీ చేసి గత నెల 15వ తేదీన పోలీసులకు చిక్కాడు. అయితే చోరీలలో కూడా సాంకేతికతను వినియోగించుకుని వాహనాల విక్రయాలు చేయటం అతని నైజంగా తెలుసుకుని పోలీసుశాఖ కూడా నివ్వెరపోయింది. 
 
చోరీతోపాటు విక్రయాలు ఇలా..
ద్విచక్ర వాహనాల తాళాలను చిటికలో తీసి సమీపంలోని పార్కింగ్‌ స్టాండ్‌లో పెట్టడం చేస్తాడు. వాహనాలకు సంబంధించిన నంబరు ఆధారంగా మీ సేవ, కంప్యూటర్‌ నెట్‌ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తాడు. సమీపంలోని మెకానిక్‌ షెడ్‌ చూసుకుని మరమ్మతులు చేయిస్తాడు. అక్కడ మెకానిక్‌తో మాటామంతి కలిపి ఆధారాలతో తన బంధుత్వాన్ని కలిపేస్తాడు. ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తామని, కొత్త మోడల్‌ వాహనాన్ని తీసుకుంటున్నట్లు రెండు రోజులు పాటు నమ్మించి ధర నిర్ణయిస్తాడు. చెప్పిన ధర ప్రకారం ఒరిజనల్‌ పత్రాలు తీసుకుని వస్తానంటూ నమ్మబలుకుతాడు. 
 
ఈలోపు మెకానిక్‌ తీసుకోవటమో...లేక ఎవరికైనా ఇప్పించేందుకు సిద్ధమై గణేష్‌కు ఫోన్‌ చేస్తారు. సొమ్ము తీసుకొని ఒరిజనల్‌ పేపర్లు అక్కడ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్న తన తండ్రి వద్దనో... లేక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న తన బావ వద్దనో ఉన్నాయంటూ నమ్మించి వారికి వాహనం అప్పగించి వారిని కూడా స్టేషన్‌కో.. బ్యాంకు వద్దకో తీసుకుపోతాడు. అక్కడ నగదు మా వారికి చూపించాలంటూ చెప్పి కొద్దిసేపు అటూ...ఇటూ తిరిగి ఊడాయించి వెళ్లిపోవటం గణేష్‌ నైజం. అయితే గణేష్‌తోపాటు మరో ఇద్దరు కూడా వాహన చోరీలో సహకరించినప్పటికీ  వారు నేరుగా సీన్‌లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే పోలీసులు కూడా వారు ఎవరైనేది చెప్పకుండానే విచారణ ప్రారంభించారు.
 
కార్తీకమాసమే టార్గెట్‌
బాపట్ల ప్రాంతంలో కార్తీకమాసమంటే ద్విచక్రవాహన చోదకులు హడలిపోతారు. రెండేళ్ల క్రితం కార్తీకపౌర్ణమి రోజు కనీసం 15వాహనాలు చోరీకి పాల్పడగా ఆవి కృష్ణాజిల్లా ఘంటసాల స్టేషన్‌ పరిధిలో రికవరీ చేశారు. గణేష్‌ టీమ్‌ పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)