ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్దానాన్ని వణికిస్తున్న ఎలుగులు
Published on Sat, 01/11/2020 - 12:58
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన, తీర ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తూ ప్రజలను వణికిస్తున్నాయి. అక్కుపల్లి, గుణుపల్లి, బాతుపురం, మోట్టూరు, చినవంక, చినకొత్తూరు, తోటూరు, డోకులపాడు, రాజాం, కిడిసింగి తదితర గ్రామాల్లో రేయింబవళ్లు అని తేడా లేకుండా గ్రామాల్లో సంచరించడంతో భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఎలుగుల దాడిలో మృతి చెందారని వాపోతున్నారు. దీంతో తమ జీవనాధరమైన జీడి తోటలకు వెళ్లేందుకు జంకుతున్నారు. రాత్రిళ్లు కూడా గ్రామ వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
#
Tags