amp pages | Sakshi

బీజేపీ, టీడీపీ దొందూ దొందే

Published on Fri, 05/22/2015 - 03:37

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
 
 అనంతపురం సిటీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీ  దొందూ దొందేనని వక్తలు  ఎద్దేవా చేశారు.  స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏపీకి ప్రత్యేక హోదా-రాయల సీమకు ప్రత్యేక ప్యాకేజీ-జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతూ సీపీఎం నగరకమిటీ కార్యదర్శి నాగేంద్ర అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

 సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐ నగర కార్యదర్శి లింగమయ్య, నరసింహులు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ వీరభధ్రయ్య, సీఐటీయూ నాయకులు సూర్యనారాయణ, ముష్కిన్, గోపాల్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇప్పుడు  ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు ఊరికే ఉంటాయా అంటూ దాటవేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని  ఇతర దేశాల్లో అడుక్కుంటున్న చంద్రబాబు ప్రత్యేకహోదా గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టుల గురించి ఆలోచించలేద న్నారు. ప్రస్తుతం నిధులు కేటాయించకుండా కాలువగట్లపై నిద్ర పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాయలసీమకు అన్యాయం చేసి కోస్తాను తన పార్టీకి పెట్టని కోటగా మార్చుకునేందుకు బాబు యత్నిస్తున్నాడన్నారు.

పట్టిసీమకు రూ.1300 కోట్లిచ్చి, హంద్రీ-నీవాకు కేవలం 200 కోట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్న చంద్రబాబు అదే సొమ్మును కాలువల నిర్మాణానికి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్నికల సమయంలో టీడీపీ పెట్టిన ఖర్చును రాబట్టుకోవడానికి చూస్తున్నారే తప్ప రాయలసీమకు నీరివ్వాలి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తేవాలన్న తపన ఏ కోశానా లేదన్నారు. ముందు ముందు పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)