amp pages | Sakshi

గతంలో ఉదయ్‌ భాస్కర్‌, ఝాన్సీరాణి కూడా..

Published on Sun, 09/15/2019 - 21:09

సాక్షి, దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద రాయల్‌ వశిష్ట బోటు మునక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1960లో ఉదయ్‌ భాస్కర్‌ అనే బోటు మునిగిపోవడంతో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగిపోవడంతో 8మంది మృతి చెందారు. కచులూరు మందం ప్రాంతంలో బోటు ఎగువవైపునకు వెళ్లే చోట బలమైన రాయి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బోటు ఎగువకు వెళ్లే చోట బలమైన రాయితో పాటు నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా 2017లో విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా పడిన దుర్ఘటనలో 22మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

చదవండిగోదావరిలో ప్రమాద సుడిగుండాలు

బోట్లలో భద్రత ప్రశ్నార్థకం

నాటు పడవలే ఆధారం..
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో గౌతమి, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల తీరం వెంబడి ఉన్న పలు గ్రామాలకు నాటు పడవలే ఆధారం. వాటిమీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవన యానం సాగిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలోపట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సరైన రహదారి వసతులు లేక తప్పనిసరి పరిస్దితుల్లో పడవలను ఆశ్రయించి ఎందరో  లంక గ్రామాల ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది (2018)  జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే దేవీపట్నం మండలంలో జరిగిన పర్యటక బోటు ప్రమాదం జిల్లా వాసులను కలచి వేసింది. 

చదవండి:

8 మంది మృతి, 25మంది గల్లంతు!

శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...

క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ

సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు

మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి

బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్

రాయల్ వశిష్టకు అనుమతి లేదు...

పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్
పాపికొండలు విహార యాత్రలో విషాదం!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)