ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కేంద్రానికి టీడీపీ డెడ్ లైన్ పెట్టాలి: బొత్స
Published on Mon, 05/25/2015 - 12:21
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ మహానాడులో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసేందుకు కేంద్రానికి డెడ్ లైన్ పెట్టాలని ఆయన సోమవారమిక్కడ సూచించారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ ఏం చేయదలచుకుందో మహానాడు తీర్మానంలో స్పష్టం చేయాలని బొత్స అన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ అన్నింటిలోనూ విఫలం అయిందని ఆయన విమర్శించారు. ప్రతి పనికి ఇంత రేటంటూ టీడీపీ దోపిడీకి తెగబడతోందని బొత్స మండిపడ్డారు.
#
Tags