వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాలుడి అదృశ్యం
Published on Wed, 09/23/2015 - 17:50
పెద్దకడబూరు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో మహేంద్ర (15) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం గొర్రెలు కాయటానికి వెళ్లిన మహేంద్ర సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి సమీపాన ఉన్న చెరువు కట్టమీద బాలుడికి సంబంధించిన చెప్పులు, సైకిల్, అన్నం బాక్సు ఉన్నాయి.
ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఉంటాడేమోనని అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
#
Tags