అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
Breaking News
జలీల్ఖాన్ కూతురికి టీడీపీ టికెట్..!
Published on Wed, 01/23/2019 - 13:27
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ఖాన్ ప్రకటించారు. జలీల్ఖాన్ మంగళవారం తన కుమార్తె షాబానాతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్ఖాన్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Tags