amp pages | Sakshi

వసూలు చేసిన ఫీజు తల్లులకు వెనక్కివ్వండి

Published on Thu, 05/07/2020 - 03:48

సాక్షి, అమరావతి: పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని తిరిగి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆయా కళాశాలలకు లేఖ రాశారు. కోవిడ్‌–19తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పేద వర్గాల విద్యార్థుల మంచి చదువుల కోసం నవరత్న హామీల్లో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామన్నారు. సీఎం లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. 

ప్రియమైన మిత్రులారా..
► నేను రాష్ట్ర ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన నాటికి రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ. అదే సమయంలో వేల కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. తాజాగా కోవిడ్‌–19తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్న విషయం మనందరికీ తెలిసిందే. 

► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘నవరత్నాల’ హామీల మేరకు మా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కట్టుబడి ఉంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆ సంవత్సరపు విద్యార్థులతో పాటు అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్‌ విద్యార్థులకు కూడా అమలు చేస్తోంది. 

► వీరి కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4 వేల కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం విడుదల చేయకుండా వదిలేసిన రూ.1,880 కోట్లు కూడా ఇచ్చాం. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల మొత్తం అదే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.

► ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కేవలం రూ.35 వేలకు మాత్రమే పరిమితం చేసింది. తక్కిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకొనేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లిస్తున్నందున ఆయా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని తల్లుల బ్యాంకు అకౌంట్లలో తిరిగి జమ చేయాలని కాలేజీ యాజమాన్యాలను కోరుతున్నాను.

► ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పడానికి, అందుకనుగుణంగా విద్యా సంస్థలకు సహకారం అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇదే సమయంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడే, నిబంధనలు పాటించని కొన్ని విద్యా సంస్థలను ఉపేక్షించబోము. బోధన, బోధనేతర సిబ్బందిని, విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కొన్ని కాలేజీల గురించి ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

► నిరుపేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రధాన లక్ష్యం. 2020–21 విద్యా సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా తల్లుల బ్యాంకు అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమ చేస్తాం.

► ప్రభుత్వం అందించిన ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను తల్లులు కాలేజీలకు వచ్చి చెల్లిస్తారు. దీనివల్ల తల్లులు తమ పిల్లలు చదువుతున్న కాలేజీలను ఏడాదిలో నాలుగుసార్లు సందర్శిస్తారు. పిల్లల చదువుల పురోగతి ఎలా ఉందో పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. 

► కాలేజీల యాజమాన్యాలన్నిటికీ ఒక విన్నపం చేస్తున్నాను. మా ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయడానికి కట్టుబడి ఉంది. అందువల్ల (2020–21 విద్యా సంవత్సరం నుంచి) ఇకపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నాను. నాలెడ్జ్‌ సొసైటీ నెలకొల్పే దిశగా నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం.  
    – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ 

Videos

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)