Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
Published on Sat, 10/05/2019 - 11:54
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ కానున్నారు. ప్రధాని మోదీని ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించనున్నారు. అదేవిధంగా పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్ వివరించనున్నారు.
అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో సీఎం చర్చించనున్నారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా చర్చించనున్నారు. కాగా రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.
Tags