amp pages | Sakshi

మొక్కుబడి సదస్సులు

Published on Thu, 12/18/2014 - 01:33

రుణవిముక్తి పత్రాల పంపిణీకే పరిమితం
రైతు సాధికారతపై హోరెత్తిన నిరసనలు
అన్నదాతల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు
20 వేలకు పైగా అభ్యంతరాలు

 
రుణమాఫీపై రణరంగంలా సాగిన రైతుసాధికార సదస్సులు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 11న ప్రారంభమైన ఇవి షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో ముగిసినప్పటికీ మిగిలిపోయిన పంచాయతీలు, వార్డుల్లో బుధవారం కూడా నిర్వహించారు. రుణవిముక్తి పత్రాల పంపిణీయే వీటి లక్ష్యమైనప్పటికీ గత నెలలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’ యాక్షన్ టేకెన్ ప్లాన్, స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్, ఖరీఫ్ సాగు, రబీ యాక్షన్ ప్లాన్‌పై చర్చించడం, రెండు నెలలుగా మిగిలిపోయిన పింఛన్లు, హుద్‌హుద్ సాయం పంపిణీ వంటి అంశాలను చేర్చారు. ఇవేవీ లేకుండానే మొక్కుబడిగా నిర్వహించారు. మెజార్టీ సదస్సులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు కదా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు రాకపోవడంతో రైతుల నిరసనలను అధికారులే ఎదుర్కోవాల్సివచ్చింది.
 
విశాఖపట్నం: జిల్లాలోని 925 పంచాయితీలతో పాటు జీవీఎంసీ, నర్సీపట్నం, యలమంచలిమున్సిపాల్టీల్లోని వార్డుల్లో రైతుసాధికార సదస్సులు మొక్కుబడిగా నిర్వహించి అధికారులు అయిందనిపించారు. జిల్లాలో 1,30,979 రైతులకు రూ.349.34 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో రూ.157.17కోట్లు సర్దుబాటు చేసింది. 50 వేలలోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ   చేస్తున్నామని, ఆపైన స్కేల్‌ఆఫ్ పైనాన్స్ పరిధిలో అర్హత పొందిన రుణమొత్తంలో 20 శాతం మాఫీమొత్తాన్ని తొలి విడతలో రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం రుణాల వడ్డీకి కూడాసరిపోవడం లేదని రైతులు గగ్గోలుపెట్టారు. అలాగే గందరగోళంగా మారిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వ్యవహారంపై అన్నదాతలు ఈ సదస్సుల్లో గళమెత్తారు. రుణమాఫీ కాక అప్పుల ఊబిలో కూరుకు పోయిన డ్వాక్రామహిళలుసైతం ఈ సదస్సుల్లో తమ గళాన్ని వినిపించారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఆంధ్రాబ్యాంకుకు తాళాలు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇదేపరిస్థితి దాదాపు 80శాతం సదస్సుల్లో కనిపించింది. వాస్తవానికి తొలివిడతలో రుణమాఫీకి అర్హులైన 1,30,979 మందికి రుణవిముక్తి కార్డులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ సదస్సుల్లో కేవలం 22,069 మందికి పంపిణీ చేశారు.  ప్రచార ఆర్భాటంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.35 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. కానీ ఈ సదస్సుల్లో కేవలం16,212 మందికి రూ.1.84 కోట్లు విలువైన పింఛన్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలినవారికి పోస్టల్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుల్లో స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు 676 పంచాయతీలు అంగీకరించగా, 59 వ్యతిరేకించాయి. ఇక 86 పంచాయతీలను స్థానిక ప్రజాప్రతినిధులు, 22 పంచాయతీలను అధికారులు, మరో 86 పంచాయతీలను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.

ఇక హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న 5,66,495 బాధితులు, రైతులకు రూ.320.41కోట్ల సాయం పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం తీరా సదస్సులు పూర్తయ్యే సరికి కేవలం రూ.44.96కోట్ల సాయం పంపిణీకి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ మాత్రమే ఇవ్వగలిగింది. జన్మభూమి యాక్షన్ టేకెన్ ప్లాన్‌పై 704 గ్రామాల్లో అనుకూలంగా, 31 గ్రామాల్లో వ్యతిరేకంగా అభిప్రాయాలు వచ్చాయి. ఇక ఈ సదస్సు ల్లో సుమారు 20వేలకు పైగా అభ్యంతరాలు రైతుల నుంచి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా 50వేల లోపు రుణాలున్న వారు తమకు తక్కువ మొత్తమే జమైందని ఫిర్యాదు చేయగా, మిగిలిన వారిలో ఎక్కువ మంది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మొరపెట్టు కున్నారు. ఈసదస్సుల్లో ఎక్కడికక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళల తమ నిరసన గళం విన్పించారు.
 

 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)