ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
14 న మన్యం మహాధర్నా
Published on Wed, 07/12/2017 - 13:26
విజయవాడ: విశాఖ ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. గిరిజనుల మరణాలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలపై టీడీపీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 న విశాఖ జిల్లా పాడేరులో ఐటీడీఏ సెంటర్ ఎదుట ఏపీసీసీ ఆధ్వర్యంలో మన్యం మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ మహాధర్నాను కాంగ్రెస్ నాయకులు, అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ మన్యం ప్రాంతంలోని గిరిజనుల మరణాలు , ఆరోగ్యం, సబ్ ప్లాన్ నిధులు తదితర అంశాలపై పోరాడేందుకే ఈ ధర్నాను చేస్తున్నట్టు తెలిపారు. మన్యంలో వైద్యసేవలు మెరుగు పడటం లేదన్నారు. మూడేళ్ల నుంచి వైద్య నిపుణుల నియామకం జరగలేదని తెలిపారు. ఈ ధర్నాలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజా, మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ లతో పాటు రాష్ట్ర, కేంద్ర నాయకులు పాల్గొంటారన్నారు.
#
Tags