amp pages | Sakshi

క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్

Published on Sat, 02/14/2015 - 03:48

  • రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్
  •  సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ  క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇప్పుడే ధైర్యంగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల విశ్వాసం చూరగొనే కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడు పార్టీకి పూర్వవైభవం ఖాయం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు. విజయవాడలో శుక్రవారం ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రస్థాయి మేధోమథన సదస్సు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యంలో పార్టీ నేతలు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై టీడీపీ, బీజేపీ తదితర పార్టీల అభిప్రాయాన్నే కాంగ్రెస్ సమర్థించినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన టీడీపీ, బీజేపీలు వాటిని గాలికొదిలేశాయని, ఈ విషయాలనేప్రజల్లోకి తీసుకెళ్లి విశ్వాసాన్ని చూరగొనాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలన్నారు.

    ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించి.. స్వార్థంతో మరోపార్టీల్లోకి వెళ్లారనీ, ఇప్పటికీ పార్టీలో ఇమడలేమని అధైర్యపడేవారు ఉంటే వేరే పార్టీల్లో చేరినా బాధపడేది లేదన్నారు. రఘువీరా మాట్లాడుతూ.. మేధోమథన సదస్సులో పార్టీ నేతలందరూ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెలిబుచ్చాలన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు కూడా ప్రసంగించారు.
     
    మొదటి రోజు మేధోమథనంలో 75 మంది

    తొలిరోజు సదస్సుకు వివిధ జిల్లాల నుంచి 75 మంది నేతలు పాల్గొన్నారు. వీరిని 4 గ్రూపులుగా చేసి పలు అంశాలను చర్చించారు. ఈ క్రమంలో ఎన్నికలప్పుడు అనుసరించిన తీరు, పార్టీ నిర్ణయాలు, పర్యవసానం, ప్రజల స్పందన వంటి అంశాలపై  నేతలు కీలక సూచనలు చేశారు.

     చిరు, బొత్స తదితరుల గైర్హాజర్

     పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులైన చిరంజీవి, బొత్స సత్యనారాయణ, టి  సుబ్బరామిరెడ్డి, చింతా మోహన్, కిశోర్‌చంద్ర దేవ్, సాయిప్రతాప్‌లు సదస్సుకు గైర్హాజరయ్యారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)