నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
సోనియా గుడి కూల్చివేత ఘటనపై 14మందిపై కేసులు
Published on Thu, 12/05/2013 - 15:29
కరీంనగర్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫ్లెక్సీలతో కట్టిన గుడిని కూల్చి వేసినందుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీన్ని నిరసిస్తూ ఆమె చిత్రపటానికి పాలభిషేకం చేశారు. తెలంగాణ చౌక్లో సోనియాగాంధీ ఫ్లెక్సీలతో కట్టిన గుడిని కొంతమంది బీజేపీ మహిళా కార్యకర్తలు కూల్చివేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని త్వరతగతిన ఏర్పాటు చేసేందుకు సోనియా గాంధీ చొరవే కారణమంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె గుడి ఏర్పాటులో నిమగ్నమైయ్యారు. ముందుగా సోనియా గాంధీకి ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేశారు.
దీన్ని నిరసించిన బీజేపీ మహిళా కార్యకర్తలు సోనియా గుడిని కూల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు టూటౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించాయి. మహిళల పట్ల పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించారని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.ఒక మహిళ మెడ నుంచి మంగళసూత్రాన్ని కూడా తెంపేశారని వారు ఆరోపిస్తున్నారు.
Tags