amp pages | Sakshi

నిమ్స్ అమ్మేందుకు కుట్ర

Published on Fri, 01/24/2014 - 03:38

 బీబీనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మించిన నిమ్స్ యూనివర్సిటీని అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని, ఉద్యమాలు చేపట్టడంతో దానిని అమ్మనివ్వకుండా ఆపగలిగామని తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన  ప్రసంగించారు. తెలంగాణ ప్రాజెక్టులను సీమాంధ్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. షుగర్, ఆల్విన్ పరిశ్రమల అమ్మకాలు జరిపిందన్నారు.
 
 తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మాదిరిగానే నాలుగేళ్లుగా నిమ్స్ కోసం ఉద్యమం చేయక తప్పడం లేదన్నారు.  2013 జూన్‌లో నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగలేదనడానికి ఈ యూనివర్సిటీయే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్ పూర్తయితే బీబీనగర్, భువనగిరిలు అద్భుత వికాస కేంద్రాలుగా మారుతాయన్నారు. తెలంగాణ ప్రాంతం వైద్యరంగంలో పూర్తిగా వెనుకబడిందని, ఇక్కడ మెడికల్ యూనివర్సిటీలను నిర్మించాలని శ్రీకృష్ణ కమిటీయే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
 
 అయినా ప్రభుత్వం నిమ్స్‌ను అభివృద్ధి చేయకుండా.. అందుకు సంబంధించిన నిధుల జీఓ అమలు కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. అదే విధంగా సీసీఎంబీ నిర్మాణం, ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ప్రాణహిత-చేవెళ్లకు తరలించేలా నిధులు ఖర్చు చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే తప్ప పరిష్కారం లభించడం లేదన్నారు. పోరాట దిశగా వెళ్తే తప్ప నిమ్స్ పూర్తి కాదన్నారు. వైద్యసేవలు ప్రారంభమయ్యే వరకు ప్రజా సంఘాలు, విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
 
 తెలంగాణ ఆస్తులను దోచుకున్న
 ఆంధ్రా పాలకులు
 ఆంధ్రా పాలకులు తెలంగాణలోని విలువైన భూములను, ఆస్తులను, ఉద్యోగాలను దోచుకొని అన్ని రంగాలలో తీరని అన్యాయం చేశారని కోదండరాం అన్నారు. కమిటీల పేరుతో ఉద్యోగ రంగాలలో అక్రమాలకు పాల్పడుతుండడం వల్లే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ముల్కీ రూల్స్ విధానాన్ని రద్దు చేసి ఇక్కడి వేల ఎకరాల విలువైన భూములను ఆంధ్రా పాలకులు స్వాధీన పరుచుకున్నారన్నారు. 610 జీఓ కోసం నిలదీస్తే గ్లిర్‌గ్లానీ కమిటీ వేశారని, కానీ కమిటీకి నిధులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. చివరికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే నిధులు మంజూరు చేశారన్నారు.  ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో జరిగిన చేర్పులు, మార్పులను ముఖ్యమంత్రి కిరణ్ కప్పి పెడుతున్నారన్నారు. నిజాం పాలన వల్లే తెలంగాణ వెనుకబడిందని అసెంబ్లీలో ఆంధ్రా పాలకులు బురద చల్లుతున్నారన్నారు. నిజాం సర్కార్ హయాంలో పెట్టిన రూ.2వేల కోట్లు విలువ చేసి చక్కర పరిశ్రమను సీమాంధ్ర ప్రభుత్వం అమ్ముకుందని, అలాగే నిజాం కాలం నాటి విలువైన భూములను ఆంధ్రా పెత్తందారులు కబ్జాలు చేశారని ఆరోపించారు.
 
 తెలంగాణ బిల్లుపై చర్చ జరగనివ్వకుండా అడ్డుకొని కాగితాలను తగులబెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక  అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌యాదవ్, టీజేఎసీ డివిజన్ కన్వీనర్ పూస శ్రీనివాస్, మండల కన్వీనర్ జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, స్వాతంత్ర సమరయోధులు కొలను శివారెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)