amp pages | Sakshi

ఏసీబీ వలలో అవినీతి చేప

Published on Sat, 10/31/2015 - 01:57

పట్టాదారుపాసుబుక్కుల మంజూరుకు లంచం డిమాండ్
రూ. 35వేలు తీసుకుంటూ పట్టుబడిన పీలేరు తహశీల్దార్

 
పీలేరు : ఉచితంగా సేవలందించాల్సిన ఆ అధికారి అడ్డుగోలు సంపాదనకు అలవాటు పడ్డాడు. పట్టాదారుపాసుబుక్కుల కోసం  లంచం డిమాండ్ చే శాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాదేయపడినా జాలి లేకుండా కాదుపొమ్మన్నాడు. చేసేదేమి లేక ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. పీలేరు తహశీల్దార్ వీ.సురేష్‌బాబు శుక్రవారం లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి వివరాల మేరకు.. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ కృష్ణారెడ్డిగారిపల్లెకు చెందిన శంకరయ్య కాకులారంపల్లె వద్ద 1.31 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. భూమిని తనపేరిట మార్చుకుని పాసుబుక్కుల కోసం తహశీల్దార్ సురేష్‌బాబు వద్దకు వచ్చాడు. ఆయన సూచన మేరకు గత ఏప్రిల్‌లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత తహశీల్దార్‌ను కలవగా రూ. 50వేలు డిమాండ్ చేశాడు. తాను దళితుడినని, అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పి నా తహశీల్దార్ మాత్రం కరుణించలేదు. అనంతరం రెండునెలలుగా పలుమార్లు కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రెండు రోజుల క్రితం రూ. 35వేలకు ఒప్పందం కుదుర్చుకుని గురువారం తిరుపతి రేంజ్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. 

ఈ మేరకు ఏసీబీ అధికారులు రూ. 35వేలు శంకరయ్యకు ఇచ్చి తహశీల్దార్‌కు  ఇవ్వాలని సూచించి పంపించారు. శుక్రవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన 20 నిమిషాల్లో రైతు నగదు ముట్టజెప్పాడు. అక్కడే మాటువేసిన అధికారులు వెంటనే తహశీల్దార్‌ను  అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్, రికార్డులు సీజ్ చేశారు. కార్యాలయ సిబ్బంది సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేయించి గేట్లు మూసి తనిఖీలు నిర్వహించారు. పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీకి సం బంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోని డేటా పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. దాడిలో ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే కార్యాలయంలో కులధృవీకరణ పత్రం మంజూరు కోసం జూనియర్ అసిస్టెంట్ రూ. 500 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌