రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
Breaking News
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
Published on Thu, 11/16/2017 - 08:52
కడప అర్బన్ : కడప నగర శివారులో కడప– రాజంపేట జాతీయ రహదారిలోని గురుకుల పాఠశాల సమీపంలోబుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు, ఎస్ఐ కుళ్లాయప్పల వివరాల మేరకు .. ప్రొద్దుటూరు పట్టణం విజయనగరం వీధికి చెందిన కొండయ్య (60), ఆయన భార్య మునెమ్మ(55)లు తమ బంధువులు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి బుధవారం ఉదయం ప్రొద్టుటూరు నుంచి రాజంపేటకు మోటార్ సైకిల్లో బయలు దేరి వెళ్లారు.
అక్కడ బంధువులను పరామర్శించి తిరిగి ప్రొద్దుటూరు బయలు దేరారు. కడప నగర శివార్లలోని గురుకుల పాఠశాల వద్దకు రాగానే వారి మోటార్ సైకిల్ను వేగంగా లారీ వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెనకాల ఆటోలో వస్తున్న బంధువులు వెంటనే వీరిని రిమ్స్కు తీసుకుని వెళ్లారు. రిమ్స్ క్యాజువాలిటీలో చికిత్స పొందుతూ దంపతులిద్దరూ బుధవారం రాత్రి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags