amp pages | Sakshi

నష్టం అనంతం

Published on Sun, 10/15/2017 - 15:14

అనంతపురం అగ్రికల్చర్‌: వరుణుడి ధాటికి పంటలు వర్షార్పణం అయ్యాయి. నష్టం కూడా ‘అనంతం’.  నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పదేళ్ల తర్వాత ఈయేడు చేతికొస్తాయనుకుంటున్న పంటలు కళ్లెదుటే దెబ్బతింటుంటే రైతుకు కన్నీరే మిగులుతోంది. అధిక వర్షాలతో పంటనష్టపోయి విలవిల్లాడుతున్న రైతులను పరామర్శించి భరోసా కల్పించడంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం విఫలమైంది.

20 రోజుల్లో 220 మి.మీ వర్షపాతం:
సెప్టెంబర్‌ 25న మొదలైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. 20 రోజుల్లో ఏకంగా 220 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. గతనెల 25న 6.3 మి.మీ, 26న 10 మి.మీ, 27న 3.7 మి.మీ, 28న 11.3 మి.మీ, 29న 10.5 మి.మీ, 30న 4.1 మి.మీ సగటు నమోదు కాగా... ఇక ఈ నెల ఒకటోతేదీ నుంచి వరుణుడు మరింత విరుచుకుపడ్డాడు. 2న 34.4 మి.మీ, 4న 11.9 మి.మీ, 5న 10.5 మి.మీ, 8న 13.8 మి.మీ, 9న 35 మి.మీ, 10న 14 మి.మీ, 12న 20 మి.మీ, 14న 14.6 మి.మీ వర్షపాతం నమోదైంది.  360 రోజుల వార్షిక వర్షపాతం 552 మి.మీ కాగా గత 20 రోజుల్లోనే 220 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్, జూలై ముగిసేనాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదైన జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్‌ వర్షాలకు ప్రస్తుతం 32 శాతం లోటు పూడ్చుకుని 33 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం.

వేరుశనగ, పత్తి పంటలకు భారీ నష్టం:
జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వేరుశనగ, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి, పెసర, ఆముదం పంటలకు కొంత నష్టం కలుగుతోంది.  జూన్‌లో వేసిన 1.50 లక్షల ఎకరాల వేరుశనగ తొలగించడానికి సిద్ధంగా ఉండగా వర్షాలు పట్టుకోవడంతో ఇబ్బందిగా మారింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట తొలగించడంతో పొలాల్లోనే కుళ్లిపోయింది. మిగతా ప్రాంతాల్లో కాయల నుంచి మొలకలు వస్తున్నాయి. వేరుశనగ రైతులకు రూ.250 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. అలాగే పామిడి, పెద్దవడుగూరు, గుత్తి, యల్లనూరు, పుట్లూరు, కనేకల్లు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పత్తి పంట నీటముని రూ.90 కోట్ల వరకు నష్టం జరిగే పరిస్థితి.

‘వరి’ంచని ఆశలు :
బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు కూడా వర్షానికి దెబ్బతిన్నాయి. వరి, ఇతర పంటలకు కూడా రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, పామిడి, పెద్దపప్పూరు, గోరంట్ల, కనగానపల్లి, ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి తదితర 25 నుంచి 30 మండలాల పరిధిలో చీనీ, దానిమ్మ, ద్రాక్ష, అరటి, బొప్పాయి, ఆకుతోటలు, కళింగర, కర్భూజా, దోస, టమాట, వంగ, బెండ తదితర పంటలు 17 వేల నుంచి 20 వేల ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులకు రూ.300 నుంచి రూ.320 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి. ఇలా ఇప్పటివరకు జిల్లాలో పంట నష్టం రూ.700 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేశారు.

పత్తా లేని ప్రజాప్రతినిధులు: భారీ వర్షాలతో  పంటలు వర్షార్పణమై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా ప్రజాప్రతినిధులు పత్తాలేకుండా పోయారు. పరామర్శకు వెళితే పరిహారం అడుగుతారని పాలకులు పొలాలవైపు తిరిగి చూడడం లేదు. అధికారులు కూడా మొక్కుబడిగా నష్టం అంచనాలు వేస్తున్నారు. దీంతో కచ్చితమైన పంటనష్టం లెక్కలు తేలడంలేదు. అపార నష్టం వాటిల్లినా తమ గ్రామాన్ని ఇప్పటికీ ఎవరూ సందర్శించలేదని పామిడి పక్కనే ఉన్న కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా గ్రామాల్లో  నష్టం వివరాలు సేకరించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు.

ధర్మవరం డివిజన్‌లో కుంభవృష్టి
అనంతపురం అగ్రికల్చర్‌:  ధర్మవరం డివిజన్‌పై శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకువరణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. తాడిమర్రి మండలంలో 111.6 మి.మీ కుండపోత నమోదైంది. బత్తలపల్లి 84.2 మి.మీ, నార్పల 66.2 మి.మీ, ధర్మవరం 64.7 మి.మీ, కంబదూరు 61.3 మి.మీ, రామగిరి 54.1 మి.మీ, మడకశిర 48.6 మి.మీ, సోమందేపల్లి 39.9 మి.మీ, చెన్నేకొత్తపల్లి 36.9 మి.మీ, పరిగి 35.4 మి.మీ, కనగానపల్లి 28.7 మి.మీ, రామగిరి 27.8 మి.మీ, రొద్దం 26.4 మి.మీ, కుందుర్పి 25.9 మి.మీ, యాడికి 14.7 మి.మీ, గుడిబండ 14.1 మి.మీ, అమడగూరు 12.9 మి.మీ, తాడిపత్రి 12.4 మి.మీ, రొళ్ల 11.7 మి.మీ, లేపాక్షి 10.4 మి.మీ వర్షం కురిసింది. కనేకల్లు, బొమ్మనహాల్‌ మినహా అన్ని మండలాల పరిధిలో 14.6 మి.మీ సగటు నమోదైంది. అక్టోబర్‌ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 172.3 మి.మీ నమోదైంది.జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 404 మి.మీ గానూ 33 శాతం అధికంగా 537.7 మి.మీ నమోదైంది. ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతుండగా చాలా చెరువులు నిండి మరువలు పారాయి. వందలాది చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరంది. వేరుశనగ, పత్తి, వరి, పండ్లతోటలు, కూరగాయల పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)