నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
డెంటల్ విద్యార్థి ఆత్మహత్య
Published on Wed, 02/26/2014 - 01:46
అధ్యాపకుల వేధింపులే కారణమంటూ విద్యార్థుల ఆందోళన
కడప, న్యూస్లైన్: కడప రిమ్స్లో డెంటల్ కాలేజీలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న కృష్ణచైతన్య మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాయంత్రం నాలుగుగంటలకు చైతన్య రూమ్మేట్ హాస్టలుకు వెళ్లి తలుపుతట్టాడు. ఎంతకూ తెరవకపోవడంతో కిటికీలోంచి చూశాడు. కృష్ణ చైతన్య ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండటం చూసి కేకలు వేశాడు. దీంతో తోటి విద్యార్థులు తలుపు పగల గొట్టి చైతన్యను కిందకు దింపారు. వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అధ్యాపకుల వేధింపులే కారణమంటూ మృతదేహంతో వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టర్ బంగ్లాకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అర్థరాత్రి వరకు అక్కడ నుంచి కదల్లేదు. తమకు న్యాయం చేసేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కృష్ణచైతన్యది వైఎస్సార్ జిల్లా నందలూరు. చైతన్య తండ్రి లెక్చరర్గా పనిచేస్తున్నారు.
Tags