amp pages | Sakshi

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Published on Sat, 11/30/2019 - 08:32

సాక్షి, చిత్తూరు: దళితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చిత్తూరు డివిజన్‌ విజి లెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, చిత్తూరు ఆర్డీవో రేణుక సమావేశానికి అధ్యక్షత వహించారు. నారాయణస్వామి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్నారు. వీటి ద్వారా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించవచ్చని చెప్పారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలు డివిజన్, జిల్లా స్థాయిల్లో జరిగే సమావేశాల్లో పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి   వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా నవరత్నాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే కాకుండా అన్ని చోట్ల శ్మశాన వాటికల ఏర్పాట్లకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు.  
మండల స్థాయిలో తహసీల్దార్లు 
జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు మాట్లాడుతూ మండల, నియోజకవర్గాల స్థాయిల్లో తప్పనిసరిగా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులందరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని ఆదేశించారు. శ్మశానవాటికల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని చెప్పారు. అందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను మంజూరు చేస్తామన్నారు. అనంతరం పలువురు దళిత సంఘాల నాయకులు ఉపముఖ్యమంత్రికి వినతులు అందజేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌