amp pages | Sakshi

‘అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలి’

Published on Thu, 05/21/2020 - 19:55

సాక్షి, శ్రీకాకుళం : సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధికారులను ఆదేశించారు. ఒడిశాలో వర్షాలు పడితే మనకు ముంపు వస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ శాఖల సమన్వయంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులంతా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడాలని, రైతులు సకాలంలో విత్తనాలు వేసేలా చూడాలని తెలిపారు.(వలస కార్మికులపై రాజకీయాలు )

సాగునీటి చెరువులు ప్రణాళికాబద్ధంగా నింపాలని, రైతులకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది విత్తనాలు ముందే సరఫరా చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం అతిముఖ్యమైన విషయమని, రైతులకు అండగా ఉండాలని సూచించారు. ఏడాది అంతటా పండించే పంట చేతికి రావాలన్నారు. అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వ్యవసాయానికి ఇదే సరైన సమయమని, రైతులకు పంట యాజమాన్య పద్ధతులు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది అధిక దిగుబడులు రావాలని, మార్కెటింగ్ సదుపాయాలు తెలియజేయాలన్నారు. (సోష‌ల్ మీడియాలో ట‌న్నుల కొద్దీ హింస‌)

వ్యవసాయ, జలవనరుల శాఖలు చేపడుతున్న ప్రతి చర్య రైతుల పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో వంశధార కింద 2.50 లక్షల ఎకరాలకు ప్రతి ఏడాది నీటి సరఫరా చేయాలన్నారు. గత ఏడాది జూలై రెండవ వారంలో నీరు విడుదల చేశామని, ఈ ఏడాది జూన్ 2 లేదా 3వ వారం నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నారాయణ పురం, తోటపల్లి, మడ్డువలస నుంచి జూన్ నెలలో విడుదల చేసే అవకాశముందన్నారు. విత్తనాలు పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సహాయకుల ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తామని, రైతు భరోసా కేంద్రాలు మే 30 నాటికి సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. (ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ )

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)