అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం’
Published on Fri, 06/14/2019 - 17:17
సాక్షి, తూర్పు గోదావరి : పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని నదీ ప్రవాహంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎగువున మునుపటి కన్నా 15 అడుగుల ఎత్తులో గోదావరి నదీ ప్రవాహం ఉండటంతో.. 15 లక్షల క్యూసెక్కుల నీరు కాఫర్ డ్యామ్ ద్వారా దిగువకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ఎగువన ఉన్న 33 నిర్వాసిత ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాలను, ముంపు మండలాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
#
Tags