amp pages | Sakshi

వచ్చేశాయి విద్యుత్‌ కార్లు

Published on Mon, 12/03/2018 - 11:28

సాక్షి,విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణ వాహనాలైన విద్యుత్‌ కార్లు విశాఖ వచ్చేశాయి. వీటిని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్‌.వై. దొర గురుద్వార్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా టెస్ట్‌ రైడ్‌ చేసి వాహన సామర్ధ్యాన్ని పరీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూరుశాతం పర్యావరణాన్ని రక్షించే విధంగా, ఇంధన వనరుల అవసరం లేకుండా నడిచే ఈ వాహనాలకు కిలోమీటర్‌కు కేవలం ఒక్క రూపాయి ఖర్చు అవుతుందన్నారు. సంస్థ ఉపయోగార్థం 15 వాహనాలను తీసుకున్నామని చెప్పారు. ఈఈఎస్‌ఎల్‌(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) సంస్థ నెలవారీ అద్దె ప్రాతిపదికన సమకూరుస్తుందన్నారు. 30 కిలోవాట్ల మోటారు కలిగిన ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉందని వెల్లడించారు. ఈ కార్ల నిర్వహణకు 6 ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉండటం విశేషమన్నారు.

20 చార్జింగ్‌ స్టేషన్లు
ఈ కార్ల కోసం నగరవ్యాప్తంగా 20 విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 12 కేంద్రాలు ఇప్పటికే సిద్ధం కాగా మరో ఎనిమిదింటిని త్వరలోనే పలుచోట్ల ప్రారంభిస్తామన్నారు. ఒక కారు పూర్తిగా చార్జ్‌ చేయడానికి డీసీ చార్జింగ్‌ స్టేషన్లకు 60 నుంచి 90 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఈఈయస్‌ఎల్‌ వారు 15 ఏఎంపీఎస్‌ ఏసీ చార్జింగ్‌ పాయింట్స్‌ను ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, కలెక్టర్‌ కార్యాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారన్నారు. యూనిట్‌ కరెంట్‌కు 6.95రూ. చొప్పున చెల్లించవలసి ఉంటుందన్నారు. ఒక కారు చార్జింగ్‌కు 18 యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుందని, ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేసిన కారు 120 కిలోమీటర్లు దూరం వరకు నడిపేందుకు వీలవుతుందని తెలిపారు. చార్జింగ్‌ కేంద్రాలు మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను ఎక్సికామ్‌ టెలిసిస్టమ్స్‌ సంస్థ దక్కించుకుందన్నారు. ఐదేళ్ల పాటు డీసీ చార్జింగ్‌ స్టేషన్లు నిర్వహణ చూసుకునేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టీవీఎస్‌ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు రమేష్‌ ప్రసాద్, సీజీఎంలు పి.వి.వి సత్యనానరాయణ, కె.యస్‌.ఎన్‌.మూర్తి, వి.విజయలలిత, పి.నాగేశ్వరరావు, ఒ. సింహాద్రి, పి.ఎస్‌.కుమర్, జి.శరత్‌కుమార్, ఆర్‌.శ్రీనివాసరావు, వై.ఎస్‌. ఎన్‌.ప్రసాద్, జి.శ్రీనివాసరెడ్డి, జీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?