వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఊరికి షాక్ కొట్టింది!
Published on Sun, 06/30/2019 - 19:47
సాక్షి, ప్రకాశం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జిల్లాలోని ఓ ఊరిలో దాదాపు 80 కుటుంబాల ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నగర పంచాయతీ 16వార్డు పామురుపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామంలోని 80 కుటుంబాలకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం అయ్యాయి. ప్రతి ఇంట్లో ఫ్యాన్, ఫ్రిజ్, టీవీ, సెల్ ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#
Tags