చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపాధికి ఊతం
Published on Wed, 04/22/2020 - 12:41
ఏలూరు రూరల్: పల్లెల్లో శ్రమజీవులు కదిలారు. ప్రభుత్వ భరోసాతో పలుగు,పార పట్టుకుని ఉపాధి పనులు చేపట్టారు. సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లస్థలాల పనులను వేగవంతం చేశారు. ఏలూరు మండలం కొమడవోలు గ్రామ పరిధిలో మంగళవారం ఉపాధి పనులు ఊపందుకున్నాయి. గ్రామానికి చెందిన సుమారు 300 మంది కూలీలు ఫీల్డ్ చానల్, డ్రెయిన్ పనులతో పాటు మెరక పనులు చేశారు. ఏపీఓ కిషోర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ కవిత పర్యవేక్షించారు. అధికారులు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ పనులు చేసిన కూలీలు సబ్బుతో చేతులు కడుక్కుని ఇంటి ముఖం పట్టారు.
#
Tags