amp pages | Sakshi

వ్యవసాయానికి సడలింపు

Published on Thu, 03/26/2020 - 04:11

సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌ డౌన్‌ ఆంక్షల నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, శాంతి భద్రతలు పర్యవేక్షించే ఉన్నతాధికారులకు ఉత్తర్వులు పంపారు. 

మినహాయింపులు ఇవీ..
- సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవచ్చు. 
తమ పొలాల్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులను కూడా రవాణా చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుల ఉత్పత్తితో సంబంధమున్న తయారీ యూనిట్లను నిర్వహించుకోవచ్చు.
- రబీ పంటల కోతలను నిర్వహించుకోవచ్చు. కోత అనంతరం పంట నూర్పిడి, ఆరబెట్టడం, గోతాల్లో నింపుకోవడం వంటివి చేపట్టవచ్చు. వచ్చే సీజన్‌కు విత్తనాలను ప్యాకింగ్‌ చేసుకోవచ్చు.
- హైబ్రీడ్‌ మొక్కజొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పత్తి, పప్పుధాన్యాలు, వరి, వేరుశనగ, కూరగాయల విత్తనాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శుద్ధి కేంద్రాలకు తరలించుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న విత్తన నిల్వ, పరీక్ష, శుద్ధి, గ్రేడింగ్, ప్యాకింగ్‌ వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించవచ్చు.
- వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పొలం పనులు చేసుకోవచ్చు. ముడి విత్తనాలను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించుకోవచ్చు. 
- ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన విత్తన కంపెనీలు అన్ని జాగ్రత్తలతో తమ విత్తనాలను తరలించవచ్చు. నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే ఇవన్నీ లాక్‌ డౌన్‌ నిబంధనలకు లోబడి చేపట్టాలి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా తగు జాగ్రత్తలతో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. రైల్వే గిడ్డంగుల నుంచి ఎరువులను తమ ప్యాకింగ్‌ పాయింట్లకు తరలించే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లాక్‌ మార్కెటింగ్‌కు లేదా ఒకే చోట పెద్దఎత్తున నిల్వ చేసేందుకు అవకాశం లేదు.
- ఎరువులు, పురుగు మందుల షాపులు తెరిచి ఉంటాయి. రైతులు మూడు అడుగుల దూరంలో ఉంటూ కొనుక్కోవాలి. 
- నిత్యావసర వస్తువులు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని తీసుకువెళ్లే వాహనాలకు అధికారులు అనుమతి ఇస్తారు.
- గిడ్డంగుల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. 
- లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులు, ఇతర ఉద్యోగులకు వేతనాలు పూర్తిగా ఇవ్వాలి. ఐదుగురుకు మించి ఒకే చోట పని చేయకుండా, గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. 

Videos

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)