amp pages | Sakshi

భూమి కోసం.. ప్రాణార్పణకు సిద్ధం

Published on Fri, 11/16/2018 - 12:55

ఆ భూమితో అతడికి 30 ఏళ్ల అనుబంధం. తాను చిన్నప్పటి నుంచి ప్రాణంగా చూసుకుంటున్నది. బ్యాంకులో రుణం పొంది ఆ మట్టిలోనే భవిష్యత్తును వెతుక్కున్నాడు. ఆ మట్టితల్లి కరుణతోనే తన సంతానం ఆరుగురిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశాడు. అలాంటి భూమిని అధికారులు చెరువుతొట్టి పేరుతో రికార్డుల నుంచి తొలగించడాన్ని తట్టుకోలేకపోయాడు. అధికారులందరి కాళ్లుపట్టి ప్రాథేయపడ్డాడు. తహసీల్దార్, ఎమ్మెల్యే.. కలెక్టర్‌.. చివరకు ముఖ్యమంత్రి దృష్టికి సైతం తన సమస్యను తీసుకుపోయాడు. అయితే ఎక్కడా తన సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో దిక్కుతోచక సెల్‌ టవర్‌ ఎక్కి ప్రాణార్పణకు సిద్ధమయ్యాడు.

అనంతపురం, అమడగూరు: తన పేరును పట్టాదారుపుస్తకం, 1బీలో తొలగించారంటూ ఓ దళిత రైతు మండల కేంద్రంలో సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం సంచలనం సృష్టించింది. బాధిత రైతు వివరాల మేరకు..గుండువారిపల్లికి చెందిన  రైతు సోమగుట్ట నరసింహులుకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. వీరందరికీ పెళ్లిళ్లయ్యాయి.

నరసింహులు అదే పంచాయతీలో సర్వే నంబరు 417లో ఉన్న 4–32 ఎకరాల భూమిని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. అదే భూమిపై అమడగూరు ఏపీజీబీలో కొన్నేళ్ల క్రితమే రుణం తీసుకుని రెన్యూవల్‌ చేసుకుంటున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం చెరువు తొట్టి, వాగు, వంకల భూమిని ఎవరైనా స్వాధీన పర్చుకున్నట్లయితే వెంటనే ఆయా భూముల వివరాలను రికార్డులను తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దీంతో నరసింహులు సాగు చేసుకుంటున్న 4–32 ఎకరాల భూమి కూడా చెరువుతొట్టిగా భావించిన అధికారులు పట్టదారు పాస్‌పుస్తకం, ఒన్‌బీలో ఆ భూమిని తొలగించారు. దీంతో రైతు కొన్నేళ్లుగా తన భూమిని తనకు ఇవ్వాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి సచివాలయం, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి  కూడా విన్నవించుకున్నాడు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

‘పల్లె’ వచ్చే దాకా దిగను..
తీవ్ర మనోవైదనకు గురైన రైతు ఉదయం 8 గంటల సమయంలో అమడగూరు బస్టాండు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు.  పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని కిందికి దించేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నన్ను చులకనగా మాట్లాడాడు, ఎమ్మెల్యే వచ్చే దాకా దిగను’ అంటూ స్పష్టం చేశాడు. ఎక్కడెక్కడో ఉన్న రైతు కుటుంబ సభ్యులను పిలిపించి వారితో చెప్పించినా ససేమీరా అన్నాడు. చివరకు తహసీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ త్వరలో అసైన్డ్‌మెంట్‌ కమిటీ నిర్వహిస్తామని, రైతు ఇద్దరు కోడళ్ల పేరు మీద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా, పాస్‌పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కుటుంబసభ్యులు కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని బతిమాలడంతో కిందకుదిగాడు. దాదాపు 5 గంటలపాటు టవర్‌పై ఉన్న రైతు కిందకు దిగడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌