amp pages | Sakshi

ఇక వరిసాగు.. కొరివితో చెలగాటమే!

Published on Fri, 03/06/2015 - 01:34

ఎఫ్‌సీఐ ద్వారా లెవీ సేకరణ నిలిపివేయనున్న కేంద్రం
ధాన్యం ‘తలరాత’ బహిరంగ మార్కెట్‌కే వదిలివేత
కనీస మద్దతుధర దక్కదని అన్నదాతల ఆందోళన
 

అమలాపురం : రైతుల నెత్తున కేంద్రం మరో పిడుగు వేయనుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా ధాన్యం లెవీ సేకరణ నిలిపివేయాలని, ధాన్యాన్ని కేవలం బహిరంగ మార్కెట్‌కే విడిచిపెట్టాలని  దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనితో పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర పొందలేక రైతులు నష్టపోయే దుస్థితి తలెత్తనుంది. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా లెవీగా సేకరించేది. గత ఖరీఫ్‌కు ముందు ఇది 75 శాతం వరకు ఉండేది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు దీనిని కస్టమ్ మిల్లింగ్ చేసిన తరువాత బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని 75 శాతం లెవీగా సేకరించడం ఏమిటని భావించిన కేంద్ర ప్రభుత్వం.. గత ఖరీఫ్ ముందు దీనిని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నట్టు 25 శాతానికి కుదించింది. ఈ నిర్ణయం రైతులకు చేదు ఫలితాలు చవి చూపించింది.

ధాన్యం కొనేవారు లేక కనీస మద్దతుధర బస్తా (75 కేజీలు)కి రూ.1,035 పొందలేకపోయూరు. రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని బియ్యం గా మార్చిన తరువాత ఎఫ్‌సీఐ సేకరిస్తుందనే భరోసా లేకపోవడంతో మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాలేదు. అలాగే    ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కనీస మద్దతు ధర చెల్లించకుండా బస్తా రూ.800కు కొనడం ద్వారా మిల్లర్లు లాభాలు ఆర్జిస్తే, రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా పెద్దగా కొనుగోలు జరగలేదు. కళ్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం వల్ల ఈ ఏడాది సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో 10.50 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం గమనార్హం. అంటే మిల్లర్లు పెద్దగాా కొనుగోలు చేయకున్నా పండిన ధాన్యంలో మూడో వంతుమాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు. దీని వల్లే రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదు. తాజాగా ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తున్న 25 శాతం లెవీని కూడా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఎఫ్‌సీఐ గొడౌన్లలో బఫర్‌స్టాక్ కోసం ప్రభుత్వం లెవీ సేకరించేది. అవసరాలకు మించి ధాన్యం నిల్వలు ఉండడంతో కేంద్రం సేకరణ నిలిపివేసిందని సమాచారం.

పండినా తప్పని దండగ..

కేంద్రం నిర్ణయం రైతులకు అశనిపాతంగా మారనుంది. ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు ఉంటుందనే భరోసా లేకుండా పోతే మిల్లర్లు ధాన్యాన్ని ఆచితూచి కొంటారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినా దీనిని మళ్లీ మిల్లర్లకు ఇచ్చి పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించాల్సి వస్తోంది. మిల్లరు కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి మొత్తం ఓపెన్ మార్కెట్‌కు తరలిస్తే డిమాండ్ తగ్గి బియ్యం ధరలు పడిపోతాయి. అదే జరిగితే మిల్లర్లకు నష్టం వస్తుంది. అలా కాక అవసరం మేరకే బియ్యాన్ని పంపినా, కృత్రిమ కొరత సృష్టించినా ధర మరింత పెరిగి మిల్లర్లు మంచి లాభాలు పొందుతారు. ఇవన్నీ చూస్తే మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. అంటే ధాన్యాన్ని వాస్తవికమైన అవసరమైన మేరకైనా కొంటారనేది ప్రశ్నార్థకం. పోనీ ప్రభుత్వ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుందా అంటే గత ఖరీఫ్‌లో కొన్నది మూడో వంతే. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వచ్చే రబీలో జిల్లాలో ధాన్యం దిగుబడి13 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా. పరిస్థితి చూస్తే దిగుబడి పెరిగి.. కొనుగోలు తగ్గేలా ఉంది. అదే జరిగితే రైతులు లాభసాటి, గిట్టుబాటు ధర అటుంచి కనీస మద్దతు ధర కూడా పొందే అవకాశం లేకుండా పోతుంది.

అంటే బాగా పండినా రైతులు నష్టాలు చూడాల్సి వస్తోందన్నమాట. ‘ప్రభుత్వం లెవీ సేకరణ ఎత్తివేస్తే ఎత్తివేసింది. కనీసం ఇతర దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించినా ధాన్యానికి డిమాండ్ వస్తుంది’ అని రైతులు కోరుతున్నా ప్రభుత్వం తలకెక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మునుముందు వరి సాగు కొరివితో తలగోక్కోవడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)