రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కారు బీభత్సం: ఐదుగురికి తీవ్రగాయాలు
Published on Tue, 03/15/2016 - 17:20
రోడ్డు పక్కన కూర్చున్న వారిపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమూరు సమీపంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కొందరు పెడన మండలం ఉప్పలకలవగుంట గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు. వారు మంగళవారం వేమూరు వచ్చి కొండాలమ్మ గుడి వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడే రోడ్డు పక్కన బెంచిపై కూర్చుని ప్రసాదం తింటున్నారు. అదే క్రమంలో రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ నారాయణరావు కారు వేగంగా వచ్చి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags