amp pages | Sakshi

అమ్మ ఊరికి రోడ్డేయలేనోడు..! 

Published on Sun, 07/14/2019 - 08:10

ఐదేళ్లు ఎమ్మెల్యే.. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు.. సొంత నిర్మాణ సంస్థ.. ఈ నేత నియోజకవర్గంలోని గ్రామమే డి.చెర్లోపల్లి. ఇది సూరి తల్లి నారమ్మ పుట్టినిల్లు. కనీసం ఆయన శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ఈ గ్రామానికి రోడ్డు కూడా వేయించకపోవడం చూస్తే పాలన ఎంత దయనీయంగా సాగిందో అర్థమవుతోంది. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి తరచూ చెప్పే ఈ మాటలు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి సరిగ్గా అతుకుతాయి.. 

సాక్షి, బత్తలపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మండలంలోని పత్యాపురం గ్రామంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన డి.చెర్లోపల్లి రహదారి మీదుగానే వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి కాని అర్థం కాలేదు.. ఆయన హయాంలో నేతలు ఏస్థాయిలో అభివృద్ధి చేశారో. కనీసం నడిచేందుకు కూడా వీలు లేని రోడ్డును చూసి బాబు వెంట వచ్చిన పార్టీ నేతలు కూడా మనసులోనే ఇందుకోసమే ఓడిపోయామా అని బాధపడినట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఐదేళ్లు పెంచి పోషించిన పార్టీని కాదని, నమ్ముకున్న ప్రజలను.. కార్యకర్తలను నట్టేట్లో ముంచి ఆయన తన సొంత వ్యాపారాలను చక్కదిద్దుకునే పనిలో భాగంగా ఇటీవల బీజేపీలో చేరిపోవడం తెలిసిందే.

నియోజకవర్గంలోనే ఆయన తన సొంత నిర్మాణ సంస్థ నితిన్‌సాయి ఆధ్వర్యంలో ఎన్నో పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత లేకపోవడంతో విజిలెన్స్‌ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ఇదే పరిస్థితి ఉంటే లాభం లేదనుకున్న ఆయన.. ఎంచక్కా కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు మేల్కొన్న ఆ పార్టీ వర్గీయులు ఆయన హయాంలో సొంత తల్లి ఊరికి రోడ్డును కూడా వేయించుకోలేకపోయాడని  సామాజిక మధ్యమాల్లోనూ ఎండగడుతున్నారు. ఎవరికైనా అవకాశం వస్తే.. సొంత ఊరికి, నమ్ముకున్న వాళ్లకు అంతోఇంతో మేలు చేయాలనుకుంటారు. కానీ ఈయన ప్రజల బాగోగులను గాలికొదిలేసి సొంతింటిని చక్కబెట్టుకోవడం ఎన్నికల్లో ఓటమి పాలుచేసింది. 

ఆటోలే దిక్కు 
డి.చెర్లోపల్లి గ్రామం నియోజకవర్గ కేంద్రం ధర్మవరానికి 29, మండల కేంద్రం బత్తలపల్లికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కారణంగా బస్సు రద్దు కావడంతో గ్రామస్తులకు ఇప్పుడు ఆటోలే దిక్కయ్యాయి. బత్తలపల్లి నుంచి రూ.20, పత్యాపురానికి రూ.25లు వెచ్చించాల్సి వస్తోంది. ఇక విద్యార్థులు చదువుకునేందుకు 5 కిలోమీటర్ల నల్లబోయినపల్లికి వెళ్లక తప్పని పరిస్థితి. వీరంతా కాలినడకన వెళ్లి రావాల్సి ఉండటం గమనార్హం. అత్యవసర సమయాల్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. వర్షాకాలంలో ప్రయాణం దుర్భరంగా ఉంటోంది. 

రాత్రిళ్లు నరకం 
సాయంత్రం ఆరు గంటలు దాటితే ఆటోలు కూడా తిరగవు. ఇక రాత్రిళ్లు అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి చేరుకునేందుకు నరకం చూడాల్సిందే. ఇలా రాత్రిళ్లు గుండెపోటు వచ్చిన వాళ్లు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా మా గ్రామంపై దృష్టి సారించాలి.        – డి.వెంగమనాయుడు, డి.చెర్లోపల్లి, బత్తలపల్లి 

Videos

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?