amp pages | Sakshi

నిధులు మింగిన బాబు

Published on Sat, 06/01/2019 - 12:06

మార్కెటింగ్‌ శాఖ నిధులను చంద్రబాబు సర్కారు దారి మళ్లించింది. ఫలితంగా రైతు బంధు పథకం నిలిచిపోయింది. ఎంతో ఆత్రుతగా గిడ్డంగుల్లోకి ధాన్యాన్ని తరలించిన రైతులకు నిరాశ ఎదురైంది. తక్షణ అవసరాలు తీరక అప్పులు చేయాల్సి వస్తోంది. కొందరు రైతులైతే రైతు బంధు రుణాలు నిలిచాయని తెలుసుకుని     నష్టానికే అమ్ముకున్నారు.

కొడవలూరు: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు అన్నదాతలు నష్టపోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా మార్కెటింగ్‌ శాఖ గిడ్డంగుల్లో ఈ పథకం కింద భద్రపరచుకోవచ్చు. ఇలా భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ముందుగానే మార్కెటింగ్‌ శాఖ వారు ఇచ్చేస్తారు. ఈ మొత్తంతో రైతులు తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మార్కెటింగ్‌ శాఖ రైతులకిచ్చిన మొత్తానికి ఆర్నెల్ల దాకా ఎలాంటి వడ్డీ ఉండదు. రైతు మంచి ధరకు ధాన్యం అమ్ముకున్నప్పుడు మాత్రమే తీసుకున్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒక్కో రైతుకు రూ.2 లక్షల దాకా మాత్రమే రుణం కింద ఇస్తారు. ఒక వేళ ఆర్నెల్లకు పైబడినా గిడ్డండుల్లో ఉంచితే మాత్రం తీసుకున్న రుణానికి అతి తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్నెల్లలోపే విక్రయించుకుంటారు. గనుక వడ్డీ సమస్య ఉండదు.

ఆశలు అడియాసలు
రైతు బంధు పథకం అమలులో కోవూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రబీలో మరో ఆరు వేల మెట్రిక్‌ టన్నుల గిడ్డంగులు అందుబాటులోకి రావడంతో ఈ పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఈ మార్కెట్‌ కమిటీ సెస్సు వసూళ్లలోనూ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఆ నిధులనే రైతు బంధు పథకం ద్వారా రైతులకు రుణాలిస్తూ వస్తున్నారు. కమిటీ పరిధిలోని నార్తురాజుపాళెం మార్కెట్‌ యార్డ్‌లో కొత్తగా మరో ఆరు వేల మెట్రిక్‌ టన్నుల గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ రబీ పంటకు రైతు బంధు పథకం మరింత విస్తరించాలని సంకల్పించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉన్న నిధులన్నింటినీ చంద్రబాబు సర్కారు లాగేసుకోవడంతో ఈ రబీ రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేశారు.

రైతులకు మొండిచేయి
కోవూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో కోవూరు, కొడవలూరు,విడవలూరు, అల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, దగదర్తి మండలాలున్నాయి. ఈ మండలాలన్నీకూడా పూర్తిగా డెల్టా మండలాలే కావడంతో లక్షా 30 వేల ఎకరాల దాకా వరి సాగవుతుంది. అన్నీ డెల్టా మండలాలే కావడంతో సెస్సు వసూలు గణనీయంగా ఉంది. నిర్దేశించిన సెస్సు లక్ష్యాలను ఛేదించడంలోనూ జిల్లాలోనే ముందంజలో ఉంది. జిల్లాలో 11 మార్కెట్‌ కమిటీలుండగా, వీటి సెస్సు వసూలు లక్ష్యం రూ.26.16 కోట్లు కాగా జిల్లాలోని అన్ని కమిటీలు కలిపి కేవలం రూ.24.14 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. కోవూరు మార్కెట్‌ కమిటీ మాత్రం లక్ష్యం రూ.5.20 కోట్లు కాగా, రూ.5.90 కోట్లు వసూలు చేసింది. సెస్సు రూపంలో వచ్చిన మొత్తాన్ని రైతు బంధు పథకానికి వినియోగించుకునే వెసులుబాటు ఉండడం, అదనంగా గిడ్డంగులు అందుబాటులోకి రావడంతో ఈ రబీలో 480 మంది రైతులకు రైతు బంధు రుణాలివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది కేవలం 271 మంది రైతులకే రైతు బంధు రుణాలిచ్చారు. కమిటీలో గతంలోని రూ.8 కోట్లు నిధులుండడంతోపాటు ఈ రబీలో రూ.6 కోట్ల దాకా సెస్సు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ నిధులన్నీ బాబు సర్కారు లాగేసుకొంది.

రైతుల పరిస్థితి దయనీయం
రైతు బంధు రుణాలిస్తారు గనుక తక్షణ అవసరాలు గడుపుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామన్న ఉద్దేశంతో రైతులు అధికారుల లక్ష్యాల మేర గిడ్డంగులకు సరిపడా ధాన్యం నిల్వ బెట్టారు. తీరా రుణాలు చేతికందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు పంట సమయంలో ఎరువులు, పురుగు మందులు తదితరాలన్నీ దుకాణాల్లో అప్పు కింద తెస్తారు. పంట చేతికందాక వారి అప్పు చెల్లించేస్తారు. రైతులు ధాన్యం అమ్ముకోకపోయినా రైతు బంధు రుణం తీసుకుని అప్పు చెల్లిస్తారు. రుణమందుతుందని భావించి ధాన్యం గిడ్డంగుల్లో ఉంచిన వారి పరిస్థితి అప్పులు చేయాల్సి వస్తోంది.

ఆర్థికపరమైన చిక్కుల వల్లే
ఆర్థికపరమైన కొన్ని చిక్కుల వల్ల రైతు బంధు పథకాన్ని ఇప్పటి దాకా అమలు చేయలేదు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. సమస్య పరిష్కారమైన వెంటనే రైతు బంధు రుణాలిస్తాం.  
– ఉపేంద్రకుమార్,ఏడీ మార్కెటింగ్‌ శాఖ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌