amp pages | Sakshi

‘నగరం’ బాధితులకు వైఎస్సార్‌సీపీ చేయూత

Published on Mon, 06/30/2014 - 00:30

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :నగరం పైపులైన్ పేలుడు సంఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేరుగా ఇంటింటికీ వెళ్లి  మృతుల కుటుంబాలను ఓదార్చి, అమలాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివా రం పరామర్శించి పార్టీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిలో మనోస్థైర్యాన్ని నింపా రు. కుటుంబాలను పరామర్శించే సందర్భంలో రెక్కాడితే గాని డొక్కాడని వారి ఈతిబాధలను తెలుసుకుని చలించిపోయిన జగన్ పార్టీ తరఫున సాయం అందించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ ఆదేశాల మేరకు మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.25వేలు వంతున పార్టీ తరఫున సాయం అందించాలని నిర్ణయించారు.
 
 ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆదివారం తెలియచేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించి త్వరలో పార్టీ తరఫున  సాయం అందించనున్నామని వారు తెలిపారు. నగరం ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం మానవతాదృక్పథంతో స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. దేశంలో అతి పెద్ద సంఘటన అయిన నగరం గ్యాస్ విస్ఫోటంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. లేకుంటే పార్టీ తరఫున వారికి వెన్నంటి నిలుస్తామన్నారు. కేజీ బేసిన్‌లో లభ్యమయ్యే గ్యాస్‌లో రాష్ట్ర వాటా సాధించేందుకు ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌