amp pages | Sakshi

23 ఏళ్లుగా  నిరీక్షణ

Published on Tue, 04/17/2018 - 12:25

రెవెన్యూ ఉద్యోగుల చేతి వాటం వల్ల 21 మంది లబ్ధిదారులు 23 ఏళ్ల నుం చి ఇబ్బంది పడుతున్నారు. ఇన్నేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. భూములు మంజూరైన వారిలో కొం దరు లబ్ధిదారులు మరణిం చారు. ఇచ్చిన అనంతరం వారి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు. 

నెల్లూరు(పొగతోట) : రాపూరు మండలం తెగచర్లలో సర్వేనంబర్‌ 263లో 21 మందికి ఎస్సీ, ఎస్టీ, యాదవులకు ప్రభుత్వం ఒక్కొక్కరి ఎకరం చొప్పున 1995లో భూములు పంపిణీ చేసింది. అనంతరంఅధికారులు వాటికి సం బంధించిన పట్టాలు, పాసుపుస్తకాలు కేటాయించి, లబ్ధిదారులకు భూములు చూపించారు. అప్పట్లో కేటాయించిన భూముల్లో రాళ్ల గుట్టలు, చెట్లు ఉంటే బాధితులు రోజుల తరబడి శ్రమించి చదును చేసుకున్నారు. కాగా అవి రోడ్డుపక్కనే ఉన్న భూములు కావడంతో వా టిపై భూ స్వాముల కన్నుపడింది. దీంతో వారు రెవెన్యూ అధికారులతో కుమ్మకై రికార్డులు మార్చేశారు. పాసుపుస్తకాల నంబర్లు సరి చేసి ఇస్తానని వీఆర్వో లబ్ధిదారుల నుంచి వాటిని తీసుకుని తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకున్నాడు.

పాసుపుస్తకాల్లో తెగచర్ల అని చెప్పి, భూములు మాత్రం జోరేపల్లిలో ఉన్నాయని రెవెన్యూ అధి కారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బాధితులు కలెక్టరేట్, రాపూరు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ గత 23 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సెంటు భూమి తమకు కొంత భూమి వచ్చిందనే పేద ల ఆశ రోజుల వ్యవధిలోనే అడిఆశ అ య్యింది. ప్రస్తుతం ఆ భూముల్లో బడా బాబులు నిమ్మచెట్లు సాగు చేసుకుంటున్నారు. గ్రామ వీఆర్వోను బాధితులు మా భూములు ఎక్కడా? అని ప్రశ్నిస్తే జోరేపల్లిలో ఉన్నాయని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. కాగా బాధితులు జోరేపల్లి వెళ్లి పరిశీలిస్తే అక్కడి ప్ర జలు మా భూముల జోలికి వస్తారా అ ంటు వాదనకు దిగారు.

తెగచర్లలో సర్వేనంబర్‌ 245–11లో 10 మందికి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. వీటిలో లబ్ధిదారులు నిమ్మచెట్లు వేసుకున్నా రు. అయితే సంవత్సరం తర్వాత ఆ భూములు నావం టూ గ్రామానికి చెం దిన ఓ భూస్వామి రాత్రికి రాత్రే నిమ్మచెట్లను అక్రమించేశాడు.కాగా తెగచెర్లలో పేదలకు పం పిణీ చేసిన భూములే కాకుండా వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ కు గురయ్యాయి. కాగా 23 ఏళ్ల నుంచి తాము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అ ధికారులు పట్టించుకోవడం లేదని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలñ æక్టర్‌ స్పందించి తమ గ్రామంలో వి చా రణ చేపడితే అసలు విషయం బయట కు వస్తుందని వారు పేర్కొంటున్నారు.

23 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం
మాకు 23 ఏళ్ల క్రితం భూములు పంపిణీ చేశారు. వాటిని చదును చేసుకున్న తర్వాత భూ స్వాములు అక్రమించారు. భూములు సాధించుకునేందుకు 23 ఏళ్ల నుం చి పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలే దు. పట్టాలు, పాసుపుస్తకాలు ఇ చ్చి సర్వేనంబర్లు గ్రామంలోవి కా వని ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్‌ స్పందించి విచారణ చేపడితే మాకు న్యాయం జరుగుతుంది.            
  – బుజ్జమ్మ, బాధితురాలు

తల్లిదండ్రులిద్దరూ మరణించారు
నా చిన్న వయస్సులో భూములు కేటాయించారు. మా తల్లి దండ్రులు భూములు చదను చేశారు. భూములు వస్తాయనే ఆశాతో ఎదురు చూసి తల్లిడండ్రులు ఇద్దరు మరణించారు. నాకు నలుగురు ఆడపిల్లలు. భూములు వస్తే పంటలు సాగు చేసుకోవచ్చుననే ఆశాతో ఉన్నాం. జిల్లా అధికారులు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. 
–  కె.మాచర్ల, బాధితుడు

రాత్రికి రాత్రే నిమ్మచెట్లు నరికేశారు
సర్వేనంబర్‌ 245–11లో 68 సెంట్ల భూమి కేటాయించారు. దాన్ని చదును చేసుకుని నిమ్మచెట్లు వేశాం. ఏడాది తర్వాత ఓ భూ స్వామి ఆ భూమి నాదంటూ రాత్రికి రాత్రే చెట్లు నరికేశాడు. విషయం అధికారులు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నా ఇంతవరకు న్యాయం జరగలేదు.             
– శంకరమ్మ బాధితురాలు

ఫిర్యాదు అందలేదు
భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. తెగచెర్లకు సంబంధించి భూ సమస్యలపై ఒకటి రెండు ఫిర్యాదులు ఉన్నాయి. సర్వేనంబర్‌ 263పై ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాం. బాధితులు వారి వద్ద ఉన్న పాసుపుస్తకాలు తీసుకువస్తే పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తాం. 
– అనురాధ, ఇన్‌చార్జ్‌  తహసీల్దార్, రాపూరు 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)