అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముంచెత్తనున్న వానలు!
Published on Mon, 08/01/2016 - 03:01
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలను 2 రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలకు అల్పపీడనం తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారమేర్పడింది. శనివారం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం బలపడి అల్పపీడనంగా మారింది.
ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోను, తెలంగాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
#
Tags