నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మృతదేహంతో 3 కి.మీ.
Published on Sat, 07/29/2017 - 03:16
వైద్యం అందక గిరిజనుడి మృత్యువాత
విశాఖ జిల్లా రావికమతం మండలం కొంజుర్తి సమీపం లోని పెడెం పాలెం గ్రామానికి చెందిన సెగ్గే చినపోతురాజు (46) 4 రోజులుగా జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధప డ్డాడు. గురువారం అర్ధరాత్రి నుంచి తలనొప్పి తీవ్రతరం కావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు.
వాహనం ఖాళీ లేదనడంతో.. కళ్యాణపులోవ వరకూ డోలిలో మోసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తకోట మీదుగా ఓ ప్రైవేట్ వాహనంలో రోలుగుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి నుంచి మృత దేహాన్ని కళ్యాణపులోవ వరకు ఆటోలో తీసుకొచ్చి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర స్వగ్రామానికి డోలీలో మోసుకుపోయారు.
రావికమతం (చోడవరం)
#
Tags