amp pages | Sakshi

జల దిగ్బంధం

Published on Tue, 09/17/2019 - 08:20

సాక్షి, నంద్యాల: భారీ వర్షాలతో నంద్యాల రెవెన్యూ డివిజన్‌ అతలాకుతలమైంది. వాగులు, వంకలు, పంట కాల్వలు పొంగి పొర్లాయి. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనజీవనం స్తంభించి పోయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. తెల్లవారు జామున ప్రజలు నిద్రలేచే సమయానికి ఇళ్లలోకి నీరు వచ్చింది.

బయటకు వెళ్లి చూస్తే కనుచూపు మేర నీళ్లే కనిపించాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. ఇన్‌చార్జి కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి..గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టంది. ప్రధానంగా ఎనిమిది మండలాల్లో కుంభవృష్టి కురిసింది. వివిధ గ్రామాల్లో పాఠశాలలు నీటిలో చిక్కుకపోవడంతో స్థానిక సెలవు ప్రకటించారు. 


ఉయ్యాలవాడ మండలం ఆర్‌.పాంపల్లె సమీపంలో నీట మునిగిన పత్తి పంట 

జలవలయంలో చిక్కుకున్న గ్రామాలు.. 
ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లాయి. పడకండ్ల, నల్లగట్ల, బత్తులూరు, నందింపల్లి, బృందావనం, గూబగుండం, జి.కంబలదిన్నె గ్రామాలు జలమయం అయ్యాయి. వందాలాది ఇళ్లలోకి నీరు వెళ్లడంతో ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. చాగలమర్రి మండలంలో బ్రాహ్మణపల్లి, కొలుగొట్లపల్లి, రాంపల్లి, అవులపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాగలమర్రిలోని చెంచుకాలనీ, కంచెపురికాలనీల్లో అనేక ఇళ్లను వర్షపు నీరు ముంచెత్తింది. గోస్పాడు మండలంలోని యూళ్లూరు, జిల్లెల్ల, నెహ్రూనగర్‌ పసురపాడు, చింతకుంట, గోస్పాడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.


గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో ఇంటిలోకి చేరిన వరద నీరు 

మహానంది మండలం తిమ్మాపురం, అబ్బీపురం, గోపవరం, గాజులపల్లి గ్రామాల్లోని వర్షపునీరు ముంచెత్తింది. రుద్రవరం మండలంలోని నాయుడుపల్లి, ఆర్‌.కొత్తూరు, మాచినేనిపల్లి, వరికొట్టూరు, చిన్మయస్వామి చెంచుగూడెం జలదిగ్బంధంలో చికుక్కున్నాయి. కుందూ నదీ, వాగులు వంకల నీరు ఉయ్యలవాడ మండలాన్ని ముంచెత్తాయి. దీంతో  బోడెమ్మనూరు, హరివరం, ఉయ్యలవాడతోపాటు మరో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిరువెళ్ల మండలంలోని అత్యధిక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోయాయి. నంద్యాల మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. గోస్పాడు మండలంలో ముంపు పరిస్థితిపై ఇన్‌చార్జీ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సమీక్షించారు. కుండపోత వర్షాలు పడిన మండలాల్లో పంట నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఇన్‌చార్జీ కలెక్టర్‌ వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ గ్రామాల్లో బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేయూత ఇచ్చారు. 


గోస్పాడు మండలం నెహ్రూనగర్‌ వద్ద వరదనీటితో తెగిపోయిన రహదారి  

బాధితులకు భోజన సౌకర్యం.. 
వరద ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామస్థాయి నాయకులు కూడా ప్రజలకు సహకరించాలని సూచించారు. దీంతో వరద ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్పందించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.  

అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌చార్జి కలెక్టర్‌ 
రానున్న మూడు రోజులలో రాయలసీమలో, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున జిల్లాలోని అన్ని మండలాల, మున్సిపాలిటీలోని అన్ని శాఖల అధికారులు, వారు పని చేస్తున్న కేంద్రాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ డీఆర్‌ఓ, కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానమై అప్రమత్తంగా ఉంటూ విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన సమాయక చర్యలను వెంటనే చేయాలన్నారు.  

రైతులూ..ఆందోళన చెందవద్దు.. 
పంట నష్టం జరిగిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భరోసాను ఇచ్చారు. యాళ్లూరు గ్రామంలో వరద ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా వెంటనే తాగునీటిని పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుతం నీరు అధికంగా ప్రవహిస్తున్నందున వాగులు, వంకలు, నదులు దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని సూచించారు. భారీ వర్షం సమయంలో చెట్లకింద, పాత గోడలు, పిట్టగోడలు సమీపంలో ఎవరూ ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు.   

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)