నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
Published on Fri, 11/02/2018 - 17:50
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. అకారణంగా పెన్షన్ జాబితా నుంచి తీసివేసిన 490 మందికి పెన్షన్ ఇవ్వాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన పలువురి పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎంపీపీ సువ్వారి గాంధీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
పెన్షన్ జాబితా నుంచి తీసివేసిన 490 మందికి.. 2014 సెప్టెంబర్ నుంచి బకాయిలను కూడా చెల్లించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అందుకోసం ఒక్కో వ్యక్తికి 49 వేల రూపాయలు చెల్లించాలని తెలిపింది. మూడు వారాల్లో ఈ మొత్తాన్ని వారికి చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
#
Tags