amp pages | Sakshi

డీఎస్సీలో హిందీ పండిట్లకు అన్యాయం

Published on Wed, 11/14/2018 - 07:00

విజయనగరం :ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో హిందీ పండిట్లకు తీవ్ర అన్యాయం చేసింది. ఐదేళ్లుగా  డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసాం. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ విజయగరం జిల్లాకు హిందీ పండిట్‌ పోస్టులు కేవలం ఆరు మాత్రమే ఖాళీ చూపించింది. మా ఆశలు అడియాసలు చేసింది. ఆర్‌టీఐ యాక్ట్, త్రిభాషా సూత్రం ప్రకారం ప్రతీ ప్రాథమిక పాఠశాలలో ఒక హిందీ పండిట్‌ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు.  హిందీ పండిట్‌ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే హిందీ పండిట్‌ నిరుద్యోగులందరికీ న్యాయం చేకూర్చాలి– పట్నాన రాంబాబు, గంగూలి, సంజీవినాయుడు, జి.రమేష్, బి.రాము, కె.శివకుమార్, నిరుద్యోగ హిందీ పండిట్లు

విశ్వ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి..
రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విశ్వబ్రాహ్మణులకు గృహ పథకం, ఆదరణ, బీసీ కార్పొరేషన్‌ వంటి అనేక పథకాలు అమలు చేశారు. ఆ పథకాల వల్ల విశ్వబ్రాహ్మణులు ఎంతో లబ్ధి పొందారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు విశ్వబ్రాహ్మణుల కోసం ఎటువంటి పథకాలు అమలు చేయకపోవడంతో పంచ, వడ్రంగి, గోల్డ్‌స్మిత్, కమ్మరం, కంచరం, శిల్పి తదితరులంతా దీనస్థితిలో మగ్గిపోతున్నారు.–అలజంగి క్రిష్ణ, ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు

వితంతు పింఛన్‌ ఇవ్వడం లేదు...
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశానని స్థానిక ప్రజాప్రతినిధులు  నాకు  వితంతు పింఛన్‌ ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితం నా భర్త బంగర్రాజు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు ఫింఛన్‌ ఇవ్వాలని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు నాకు ఫింఛన్‌ మంజూరు కాకుండా చేస్తున్నారు. కూలి పనులు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి నాది.
– మత్స పాపమ్మ, తూరుమామిడి, మక్కువ

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి...
అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి.  మా గ్రామంలో ముగ్గురు ఏజెంట్ల ద్వారా 300 మంది సుమారు రూ.50 లక్షల వరకు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశాం. ఎంతో శ్రమపడి పైసా పైసా కూడబెట్టి భవిష్యత్‌లో అవసరాలు తీర్చుకుందామని కట్టాం. అగ్రిగోల్డ్‌ ఎత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా బాధను విన్న జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే అందరు బాధితులకు ప్రతీ పైసా చెల్లించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.–వెంకటబైరిపురం అగ్రిగోల్డ్‌ బాధితులు

దివ్యాంగ పింఛన్‌ ఆపేసారు...
దివ్యాంగుడినైనా నాకు వైఎస్సార్‌ హయాంలో ఇచ్చిన పింఛన్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆపేసారు. పింఛన్‌ను పునరుద్ధరించాలని ఎన్నోమార్లు అధికారులకు వేడుకుంటున్నా...పట్టించుకోవడం లేదు. కాలికి అంగవైకల్యం ఏర్పడడంతో కూలి పనులకు వెళ్లలేకపోతున్నాను. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. పింఛన్‌ మంజూరుచేస్తే నా జీవనానికి భరోసా ఉంటుంది.– ఉమ్మి శ్రీను, డి.సిర్లాం, మక్కువ

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)