అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
పవన్ ఉన్నాడంటూ ఓవర్ యాక్షన్..
Published on Thu, 12/05/2019 - 12:32
సాక్షి, చిత్తూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన.. పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పవన్ కల్యాణ్ గురువారం హార్సిలీ హిల్స్లోని గాలిబండకు చేరుకున్నారు. గాలిబండ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. హార్సిలీ హిల్స్కు వచ్చిన ప్రతి టూరిస్ట్ గాలిబండకు వెళ్లాలని, అక్కడి అందాలను చూడాలని అనుకుంటాడు. కానీ, పవన్ కల్యాణ్ అక్కడ ఉన్నారంటూ పర్యాటకుల పట్ల జనసేన కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పర్యాటకులు గాలిబండకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి జనసేన కార్యకర్తలు పర్యాటకులను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో గాలిబండకు వెళ్లాలకుంటున్న పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల తీరు బాగాలేదని టూరిస్టులు తప్పుబడుతున్నారు. బుధవారం మదనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అటు నుంచి నేరుగా హార్సిలి హిల్స్కు చేరుకున్నారు.
Tags