ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'
Published on Sun, 05/10/2015 - 17:46
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీ వేశాక కూడా కార్మికులు సమ్మెకు వెళ్లడం బాధనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, యాజమాన్య పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటికీ మూడు వారాల గడువు కోరామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మాత్రం ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని అచ్చెన్నాయుడు తెలిపారు.
తక్షణమే సమ్మె విరమించి మూడు వారాల పాటు సమయం ఇవ్వలని కోరామని.. కార్మిక సంఘాలు రేపు మాట్లాడుకుని సమాధానం చెప్తామన్నాయన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
#
Tags