amp pages | Sakshi

ఐఆర్‌ఎస్ సర్వే నిలుపుదల

Published on Fri, 02/21/2014 - 04:26

సర్వే గణాంకాల వాడకాన్ని మార్చి 31 వరకు నిలిపేయాలని ఎంఆర్‌యూసీ, ఆర్‌ఎస్‌సీఐ నిర్ణయం
త్వరలో సర్వే గణాంకాల పునర్ మూల్యాంకనం..

 
 సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ పత్రికల పాఠకుల సంఖ్యపై ఇండియన్ రీడర్‌షిప్ సర్వే(ఐఆర్‌ఎస్)-2013 తప్పుడు గణాంకాలు వెలువరించిన నేపథ్యంలో.. సర్వే వివరాల వాడకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సర్వే నిర్వహణ సంస్థ ‘మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్’(ఎంఆర్‌యూసీ) ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.
 
 పత్రికల పాఠకుల సంఖ్యపై ఐఆర్‌ఎస్-2013లో భారీగా తప్పులు దొర్లడంతో దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌సీఐ మేనేజింగ్ కమిటీ, ఎంఆర్‌యూసీ బోర్డు ముంబైలో సమావేశమై దీనిపై చర్చించాయి. సర్వే గణాంకాలను పునర్ మూల్యాంకనం చేయాలని సమావేశం నిర్ణయించింది. పునర్ మూల్యాంకనం పూర్తయ్యే వరకు సర్వే గణాంకాల వాడకాన్ని మార్చి 31 వరకు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
 
  ఐఆర్‌ఎస్ సర్వే గణాంకాలను పునర్ మూల్యాంకనం చేయడానికి ఒక ప్రక్రియ రూపొందిస్తున్నామని, ఇది ఈ నెల 24కల్లా ఖరారవుతుందని సమావేశం పేర్కొంది. మార్చి 31కల్లా పునర్ మూల్యాంకనం పూర్తవుతుందని, ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలను, తమ సిఫార్సులను ఏప్రిల్ తొలి రోజుల్లో ఆర్‌ఎస్‌సీఐకు సమర్పించనున్నట్లు ఎంఆర్‌యూసీ పేర్కొంది. ఆమోదం పొందిన సిఫార్సులను ఐఆర్‌ఎస్ భవిష్యత్ ప్రణాళికలో చేరుస్తారని ఓ ప్రకటనలో తెలిపింది. పునర్ మూల్యాంకనం పూర్తయ్యే వరకు సర్వే గణాంకాల వాడకాన్ని నిలిపేయాల్సిందిగా ఆర్‌ఎస్‌సీఐ, ఎంఆర్‌యూసీ, ఏబీసీలు చందాదారులు, సభ్యులకు సూచించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించింది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌