amp pages | Sakshi

వియత్నాం చేరుకున్న భారత యుద్ధనౌకలు

Published on Mon, 09/25/2017 - 01:27

విశాఖ సిటీ: యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన తూర్పు నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు వియత్నాం దేశానికి  చేరుకున్నాయి. ఐదు రోజుల పాటు వియత్నాంలోని హాయ్‌పాంగ్‌ పోర్టులో ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ నౌకలు ఉంటాయి. భారత నౌకలకు వియత్నాం నేవీ అధికారులు అక్కడ సాదర స్వాగతం పలికారు. అనంతరం వియత్నాం బోర్డర్‌ గార్డు బృందం ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ నౌకలను పరిశీలించి వాటి పనితీరు, విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదే ళ్లు దాటిన సందర్భంగా నేవీ అధికారులు దౌ త్య అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన మేరీటైమ్‌ బిజినెస్‌ మీట్‌లో ఇరు దేశాల కమాండింగ్‌ అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక, రక్షణ, సంస్కృతి, శాస్త్ర సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు.

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఇరు దేశాల యుద్ధ నౌకలు, విమానాల సందర్శన, రక్షణ పరిశ్రమ సహకారం, రక్షణ రంగంలో శాస్త్రీ య అంశాల అందిపుచ్చుకోవడం, వీపీఎన్‌ నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులపైనా మొదలైన అంశాలపై భారత్, వియత్నాం దేశాలు మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఐదు రోజుల అనంతరం.. వియత్నాం నుంచి బయలుదేరనున్న ఈ యుద్ధ నౌకలు కాంబోడియా, ఫిలిప్పీన్స్, దక్షిణకొరియా, జపాన్, బ్రూనె, రష్యాకు చెందిన 12 పోర్టులను సందర్శించనున్నాయి. మూడు నెలల పాటు ఆయా దేశాల్లో జరిగే విన్యాసాల్లో సాత్పురా, కద్మత్‌ నౌకలు పాలుపంచుకోనున్నాయి. నవంబర్‌లో దక్షిణాసియా దేశాల సంఘం థాయ్‌లాండ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలోనూ, మలేషియాలో జరిగే హ్యూమనిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌(హార్డ్‌)లోనూ తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు పాల్గొంటాయి.

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)