amp pages | Sakshi

నేల పరీక్షలు

Published on Thu, 03/13/2014 - 03:04

జిల్లాలో ఇంటర్‌మీడియెట్ పరీక్షలు బుధవారం అరకొర వసతుల మధ్య ప్రారంభమయ్యాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట ఎస్సీ గురుకుల పాఠశాలలో 395 మందికి 365 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో ఎన్‌బీకేఆర్, శ్రీనివాస, మల్లాం, కొత్తగుంట కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఓ గదిలో విద్యార్థులకు బెంచీలు కేటాయించకపోవడంతో నేలపైనే కూర్చొని పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంచీలు అందుబాటులో లేవని ప్రిన్సిపల్ సూర్య చెప్పడం గమనార్హం.
 
 నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. విద్యార్థులకు తెలుగు, సంస్కృ తం, ఉర్దూ పేపర్-1 పరీక్షలు నిర్వహిం చారు. ఇందులో జనరల్ విద్యార్థులు 27,529 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,115 మంది కలిపి 28,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండ గా జనరల్ విద్యార్థులు 1,332 మంది, ఒకేషనల్ విద్యార్థులు 135 మంది కలిపి 1,267 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్, హైపవర్ కమిటీలు పలు కేంద్రాలను తనిఖీ చేశాయి.
 
 ఆర్‌ఐఓ పరంధామయ్య మాస్టర్‌మైండ్స్, శ్రీచైతన్య, శ్రీగాయత్రి, శ్రీమేథ, ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ పాఠశాల తదితర కేంద్రాలను తనిఖీ చేశా రు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ఈ దఫా ప్రకటించడం, అర్ధగంట ముందుగా రావాలనే కొత్త నిబంధనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక కేం ద్రాల వద్దకు ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. అయితే నెల్లూరు నగరంలోని అరవిందనగర్‌లో ఉన్న వివేకానంద కళాశాల వద్ద తగిన బోర్డు ఉంచకపోవడంతో కొందరు విద్యార్థులు ఆదరాబాదరగా అదే బ్రాంచి ఉన్న స్టోన్‌హౌస్‌పేటకు వెళ్లారు. ఆ సెంటర్‌ను తమకు కేటాయించలేదని తెలుసుకుని వారు మళ్లీ ఏడుస్తూ అరవిందనగర్‌లోని కళాశాలకు వచ్చారు. ఈ లోపు కళాశాల వారు బోర్డు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నామని, లేదంటే తమ భవిష్యత్ నాశనమయ్యేదని విద్యార్థులు పేర్కొన్నారు.
 
 అరగంట ముందుగా అంటే  8.30కు చేరుకోలేదనే నెపంతో ఆలస్యానికి కారణాలంటూ విద్యార్థులతో వివరణ పత్రాలు రాయించుకున్నారు. దీంతో కొన్ని చోట్ల వారు కంగారు పడ్డారు. ఈ పత్రాలు తీసుకుని ఏమి చేస్తారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఒకటి రెండు సంఘటనలు మినహా మొత్తం మీద పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)