amp pages | Sakshi

శ్రీవారికీ బోర్డింగ్ పాస్!

Published on Wed, 07/15/2015 - 03:15

- విమానంలో ప్రయాణించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి
- ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవమూర్తులను పెట్టెలో పెట్టేందుకు శాస్త్రం అడ్డురావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- అమెరికాలో టీటీడీ కల్యాణోత్సవాల సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన ఘటన

తిరుమల వెంకన్నకు అమెరికన్ విమాన సంస్థ బోర్డింగ్ పాసా?  ఆశ్చర్యం కలుగుతోంది కదూ..! అవును.. సాక్షాత్తు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు ఈనెల 11వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి డల్లాస్‌కు ఆ దేశ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. అదేమిటో తెలుసుకుందాం..
 
సాక్షి, తిరుమల:
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి సైతం బోర్డింగ్ పాస్ తీసుకుని విమానంలో ప్రయాణించారు. ఈనెల 1 నుంచి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ, స్థానిక సంస్థలతో కలసి శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, సీవీఎస్‌వో నాగేంద్రకుమార్, అర్చకులు, అధికారులు తరలివెళ్లారు. ఇందుకోసం టీటీడీ ఆగమోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాలను కూడా వెంట తరలించింది.

అక్కడ తొలుత వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ, ఇతర వైదిక పూజలు నిర్వహించారు. తర్వాత  అవే విగ్రహాలతో శ్రీనివాస కల్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పటి నుంచి విగ్రహాలను ఆగమబద్ధంగానే ఒకచోట నుంచి మరోచోటికి తరలిస్తూ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. ఉత్సవాలు లేని రోజుల్లో కూడా మూడు పూట్లా నిత్య పూజలు ఆరాధనలు కొనసాగించారు. అయితే, ఈ నెల 10వ తేదీన వాషింగ్టన్ డీసీలో కల్యాణోత్సవం ముగించుకుని 11వ తేదీన డల్లాస్‌కు ఉత్సవమూర్తులు బయల్దేరారు. ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గంలో తరలించేందుకు సమయం సరిపోలేదు. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విగ్రహాలను తరలించాలని ఇటు టీటీడీ, అటు స్థానిక నిర్వాహకులు సంయుక్తంగా సంకల్పించారు.

ప్రాణప్రతిష్ఠతో పూజలు చేసిన విగ్రహమూర్తులను పెట్టెలో పెట్టి మూత వేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగమశాస్త్రం అంగీకరించదు. భారం ఆ వెంకన్నపైనే వేయడంతో సాక్షాత్తు ఆ స్వామే దారి చూపించినట్టైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికులకు కేటాయించే మూడు సీట్లలోనే విగ్ర హమూర్తులను తరలించేందుకు ఆగమేఘాలపై  ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు సీట్ల కోసం అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ద్వారా బోర్డింగ్ పాసులు తీసుకున్నారు. అనుకున్న విధంగానే ఉత్సవమూర్తులను విమానంలో తరలించి, డల్లాస్‌లో శ్రీవారి కల్యాణోత్సవాలను విజయవంతంగా ముగించారు. ఆసక్తికరమైన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ నిర్ణయించిన సమయాల్లోనే కల్యాణోత్సవాలను నిర్వహించడంలో టీటీడీ, స్థానిక నిర్వాహకులు నిమగ్నమయ్యారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)